AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో భక్తులకు గుడ్ న్యూస్.. లక్ష మట్టి వినాయక విగ్రహాలు ఉచితం!

GHMC Clay Ganesha Idols For Free: హైదరాబాద్‌లో పర్యావరణహితంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించేందుకు GHMC కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు, కాలనీ సంక్షేమ సంఘాలు, గణేష్ మండపాల నిర్వాహకులకు మూడు పరిమాణాల్లో మొత్తం లక్ష మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా అందించనుంది.

హైదరాబాద్‌లో భక్తులకు గుడ్ న్యూస్.. లక్ష మట్టి వినాయక విగ్రహాలు ఉచితం!
Ghmc Clay Ganesha Idols For Free
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Aug 26, 2026 | 1:11 PM

Share

GHMC Clay Ganesha Idols For Free: హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలను పర్యావరణహితంగా నిర్వహించేందుకు GHMC కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది భక్తులకు లక్ష మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వినియోగాన్ని తగ్గించి.. చెరువులు, సరస్సులు, ఇతర నీటి వనరులను కాలుష్యం నుంచి కాపాడే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ఎకో గణేశ్.. గ్రీన్ గణేశ్.. క్లే గణేశ్’ కార్యక్రమంలో భాగంగా ఈ విగ్రహాలను పంపిణీ చేయనున్నారు. GHMC పరిధిలోని సర్కిళ్లు, జోనల్ కార్యాలయాల ద్వారా సెప్టెంబర్ రెండో వారంలో మట్టి విగ్రహాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులతో పాటు కాలనీ సంక్షేమ సంఘాలు, గణేష్ మండపాల నిర్వాహకులు కూడా వీటిని పొందేందుకు అర్హులు.

మొత్తం లక్ష విగ్రహాలను మూడు పరిమాణాల్లో అందించనున్నారు. ఇందులో 70 వేల 8 అంగుళాల విగ్రహాలు, 20 వేల ఒక అడుగు విగ్రహాలు, 10 వేల 1.5 అడుగుల విగ్రహాలు ఉంటాయి. వీటి కొనుగోలుకు GHMC గరిష్ఠ ధరలను కూడా నిర్ణయించింది. 8 అంగుళాల విగ్రహానికి రూ.34.30, ఒక అడుగు విగ్రహానికి రూ.142, 1.5 అడుగుల విగ్రహానికి రూ.220 వరకు చెల్లించనుంది.

విగ్రహాల తయారీ, సరఫరా కోసం టెండర్ ప్రక్రియ ద్వారా ఏజెన్సీలను ఎంపిక చేయనున్నారు. ప్రతి కేటగిరీలో అత్యల్ప ధరను కోట్ చేసిన సంస్థకు అవకాశం ఇవ్వనున్నారు. ఎంపికైన సంస్థలు GHMC పరిధిలోని నిర్దేశిత ప్రాంతాలకు తమ సొంత ఖర్చుతో విగ్రహాలను తరలించాలి. గణేష్ ఉత్సవాలకు కనీసం వారం రోజుల ముందే విగ్రహాలను అందజేయాల్సి ఉంటుంది.

ఈసారి పంపిణీ చేసే విగ్రహాలను సహజ మట్టి, బయోడిగ్రేడబుల్ పదార్థాలతోనే తయారు చేయాలని GHMC స్పష్టం చేసింది. కృత్రిమ పదార్థాలు, కృత్రిమ రంగులు, బయోడిగ్రేడబుల్ కాని రసాయన రంగులు, ఆయిల్ పెయింట్ల వినియోగానికి అనుమతి ఉండదు.

గతేడాది ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని అధికారులు తెలిపారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం సమయంలో నీటి వనరుల్లో కాలుష్యం పెరగకుండా చూడటంతో పాటు.. పర్యావరణహిత పద్ధతుల్లో పండుగను నిర్వహించేలా ప్రజలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని GHMC అధికారులు చెబుతున్నారు.

మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుతూ గణేష్ ఉత్సవాలను జరుపుకుందాం అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని GHMC భావిస్తోంది.

Follow Us
హైదరాబాద్‌లో భక్తులకు గుడ్ న్యూస్.. లక్ష మట్టి వినాయక విగ్రహాలు..
హైదరాబాద్‌లో భక్తులకు గుడ్ న్యూస్.. లక్ష మట్టి వినాయక విగ్రహాలు..
పోలీసుల అదుపులో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?
పోలీసుల అదుపులో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?
ఇక నుంచి వంట నూనె అలా విక్రయిస్తే రూ.10 లక్షల జరిమానా, జైలు శిక్ష
ఇక నుంచి వంట నూనె అలా విక్రయిస్తే రూ.10 లక్షల జరిమానా, జైలు శిక్ష
ఇరాన్ తో లింకులున్న భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షల వేటు!
ఇరాన్ తో లింకులున్న భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షల వేటు!
ఇంట్లోనే అక్క మృతదేహం.. పక్కనే అమాయక చెల్లెలు!
ఇంట్లోనే అక్క మృతదేహం.. పక్కనే అమాయక చెల్లెలు!
చెక్క.. ప్లాస్టిక్.. స్టీల్.. కూరగాయలు కోయడానికి ఏ కటింగ్ బోర్డు
చెక్క.. ప్లాస్టిక్.. స్టీల్.. కూరగాయలు కోయడానికి ఏ కటింగ్ బోర్డు
రోజూ ఆ హీరోయిన్ ఇంటి ముందు నిలబడేవాడిని
రోజూ ఆ హీరోయిన్ ఇంటి ముందు నిలబడేవాడిని
'టాక్సిక్' హీరో యశ్ గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలు
'టాక్సిక్' హీరో యశ్ గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలు
iPhone కొనాలనుకుంటున్నారా? ఇప్పుడే కొనేయండి.. పెరగనున్న ధరలు!
iPhone కొనాలనుకుంటున్నారా? ఇప్పుడే కొనేయండి.. పెరగనున్న ధరలు!
కరివేపాకు మొక్కకు ఈ ఒక్కటి వేస్తే చాలు.. గుబురుగా పెరిగి..
కరివేపాకు మొక్కకు ఈ ఒక్కటి వేస్తే చాలు.. గుబురుగా పెరిగి..