Telangana: గుండెపోటుతో డ్రైవర్ మృతి.. పంట పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. అందులో

|

Jan 06, 2023 | 5:39 PM

ములుగు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. యాత్రికులతో వెళ్తున్న బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో.. బస్సు అదుపుతప్పింది.

Telangana: గుండెపోటుతో  డ్రైవర్ మృతి.. పంట పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. అందులో
Bus Accident
Follow us on

భక్తులతో వెళ్తున్న టూరిస్టు బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. ఆ బస్సును రోడ్డుపక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి చాకచక్యంగా దింపిన ఆ డ్రైవర్ ప్రయాణికుల ప్రాణాలు కాపాడి తను మాత్రం కన్నుమూశాడు. బస్సులో చిక్కుకున్న 40మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషాద సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలో జరిగింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాణిపాకం ప్రాంతానికి చెందిన కొంతమంది భక్తులు ఓ ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో వచ్చి భద్రాచలంలో దైవ దర్శనం చేసుకున్నారు.. అక్కడి నుండి యాదాద్రికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది..

వీరభద్రవరం గ్రామ సమీపంలోకి చేరుకోగానే బస్సు డ్రైవర్ దేవఇరక్కమ్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు.. వెంటనే రోడ్డు పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి బస్సును దింపాడు.. అతన్ని గమనించిన ప్రయాణికులు ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం దక్కలేదు.. డ్రైవర్ మృతి చెందాడు.. మృతిచెందిన డ్రైవర్ తమిళనాడు రాష్ట్రంకు చెందినవాడిగా గుర్తించారు.

గుండెపోటుకు గురైన వెంటనే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో 40మంది యాత్రికులు సురక్షితంగా బయట పడ్డారు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం తప్పడంతో యాత్రికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.