
డీజే ప్రాణాల మీదకు తెస్తోంది. గతంలో డీజే శబ్దాలతో కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.. సౌండ్ పొల్యూషన్ కారణంగా అనేకమంది అస్వస్థతతకు గురైన సంఘటనలు చాలానే ఉన్నాయి.. తాజాగా.. ఓ యువకుడు డీజే సౌండ్స్ కు కుప్పకూలాడు.. ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో చోటుచేసకుంది.. వివరాల ప్రకారం.. గ్రామంలో పెళ్లి వేడుకలకు హాజరైన పార్ధు అనే యువకుడు స్నేహితులు బంధువులతో కలిసి ఆనందంగా వేడుకల్లో పాల్గొన్నారు
పెళ్లి బరాత్ లో ఏర్పాటుచేసిన డీజే అతని ప్రాణాల మీదకు తెచ్చింది. డీజే సాంగ్స్ కు డాన్స్ చేస్తూ స్పృహ తప్పి కుప్పకూలి పోయాడు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళం లో గడ్డలు ఏర్పడటంతో ఆ యువకుడు ఆస్పత్రి పాలయ్యాడు. ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని దాదాపుగా 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆ యువకుడిది నిరుపేద కుటుంబం.. దీంతో వైద్య ఖర్చులు కోసం దాతలు సాయం చేయాలని ఆ కుటుంబం వేడుకుంటోంది.
డీజే శబ్దం వల్ల గుండె నుంచి మెదడుకు రక్తం సరఫరా చేసే నాళం గడ్డ కట్టిందని ఆపరేషన్ చేయాలని డాక్టర్ సూచించారు. పక్షవాతం వచ్చి కాళ్లు చేతులు పనిచేయడం లేదని వైద్యులు నిర్ధారించారు.
అయితే, ఆపరేషన్ చేయించేందుకు తగ దగ్గర డబ్బులు లేవని.. దాతలు లేదా ప్రభుత్వ పెద్దలు కరుణించి.. తమ కుమారుని రక్షించాలని ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..