భారత్‌లో అంతరించిపోతున్న జంతువులు ఇవే!

samatha

16 may 2026

భారత దేశంలో కొన్ని రకాల జంతువులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఇంతకీ అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

అంతరించి పోతున్న జంతువులు

బెంగాల్ టైగర్, ఆవాసాలు విచ్ఛిన్నం అవ్వడం, అక్రమ వేట, అడవుల క్షీణత వలన ఈ బెంగాల్ టైగర్స్ అంతరించి పోయే దశలో ఉన్నాయంట.

బెంగాల్ టైగర్

గుజరాత్‌లోని గిర్ అడవులలో ఎక్కువగా కనిపించే ఆసియా సింహాలు చాలా పరిమితంగా ఉన్నాయంట. ఇవి కూడా అంతరించిపోయే దశలో ఉన్నాయంట.

ఆసియా సింహం

మంచు చిరుత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవి హిమాలయ పర్వత శిఖరాలపై నిశ్శబ్దంగా సంచరిస్తాయి. ఇవి కూడా అంతరించిపోయేలా ఉన్నాయంట.

మంచు చిరుత

రెడ్ పాండాలు ఇవి ఎక్కువగా తూర్పు హిమాలయ అడవుల్లో వెదురు ప్రాంతాలలో నివసిస్తాయి, అక్రమ రవాణ, అటవీ నిర్మూలన వలన వీటి సంఖ్య చాలా తగ్గిందంట.

రెడ్ పాండాలు

భూమిపై ఉన్న అత్యంత అరుదైన పక్షులలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఒకటి. గడ్డి భూముల విధ్వంసం వలన ఇవి కూడా అంతరించి పోయే దశలోఉన్నాయంట.

ఇండియన్ బస్టర్డ్

సిల్వర్ కలర్ జుట్టుతో, సింహపు తోక కలిగి ఉండే మకాక్‌లు(ఆసియా కోతి) వర్షారణ్యాలలో ఎక్కువగా కనిపిస్తాయి. కాగా వీటి జనాభా కూడా చాలా తగ్గిందంట.

మకాక్

అలుగు , వీటి పొలుసులకు చాలా ధర ఉంటుంది. కాగా, అంతరించి పోయే జంతువులలో కూడా ఇవి కూడా ఉన్నాయంట

అలుగు