Chevella Bus Accident: చేవెళ్ల బస్సు ప్రమాదం.. చనిపోయింది వీరే.. పూర్తి వివరాలు..

సోమవారం ఉదయం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల దగ్గర జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందడం యావత్‌ రాష్ట్రాన్ని విషాదంలోకి నెట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చెరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది పలువురి ప్రయాణికులను కాపాడి హాస్పిటల్‌కు తరలించారు. స్పాట్‌ లో చనిపోయిన మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. తాజాగా కొందరి మృతదేహాలను గుర్తించిన అధికారులు వారి వివరాలను వెల్లడించారు.

Chevella Bus Accident: చేవెళ్ల బస్సు ప్రమాదం.. చనిపోయింది వీరే.. పూర్తి వివరాలు..
Chevella Bus Accident

Updated on: Nov 03, 2025 | 12:22 PM

సోమవారం ఉదయం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల దగ్గర జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందడం యావత్‌ రాష్ట్రాన్ని విషాదంలోకి నెట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చెరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది పలువురి ప్రయాణికులను కాపాడి హాస్పిటల్‌కు తరలించారు. అయితే ప్రమాదంలో ఇప్పటి వరకు 14 మృతదేహల వివరాలను అధికారులు గుర్తించారు. మరి కొంత మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 70 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రమాదంలో మరణించిన వారు వీరే..

  • బస్సు ప్రమాద మృతుల్లో 13 మంది మృతదేహాలు గుర్తింపు
  • ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ దస్తగిరిబాబా(38) మృతి
  • గంగారం తండాకు చెందిన తారిబాయ్‌(45) మృతి
  • హైదరాబాద్‌ బోరబండకు చెందిన కల్పన(45) మృతి
  • కర్నాటక భానూర్‌కు చెందిన నాగమణి(55) మృతి
  • బోరబండకు చెందిన గోగుల గుణమ్మ మృతి
  • దౌల్తాబాద్‌కు చెందిన మల్లగండ్ల హనుమంతు మృతి
  • యాలాల్‌కు చెందిన గుర్రాల అభిత (21) మృతి
  • తాండూరుకు చెందిన షేక్‌ ఖలీల్‌ హుస్సేన్‌, తనూషా మృతి
  • తాండూరుకు చెందిన తబస్సుమ్‌ జహాన్‌, తాలియా బేగం మృతి
  • తాండూరుకు చెందిన సాయిప్రియ, నందిని మృతి

అయితే ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించిన అధికారులు పోస్ట్‌మార్టం నిర్వహించి ఆ మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వారిలో కర్నాటక రాష్ట్రానికి చెందిన నాగమని అనే మృతదేహం, గంగారం తండాకు తరిబాయి అనే మహిళ మృతదేహం తరలింప. మృతుడు నజీర్ మృతదేహాన్ని తాండూర్‌కు తరలించిన అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.