PMFBY Scheme: పీఎంఎఫ్బీవై పథకం కింద్ర వివిధ రాష్ట్రాలకు నిధులు విడుదల చేసిన కేంద్రం.. తెలంగాణకు రూ.148 కోట్లు..
Central Govt: అకాల వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది.
Central Govt: అకాల వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. గత మూడు సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సంభవించిన ప్రకృతి వైపరిత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నష్టపోయిన రైతుల కోసం ప్రధాన మంత్రి బీమా యోజన(పీఎంఎఫ్బీవై) పథకం కింద దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఈ పరిహారం విడుదల చేసినట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
కాగా, పీఎంఎఫ్బీవై పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం రూ. 148.9 కోట్లు విడుదల చేసింది. అయితే, తెలంగాణ వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా గత మూడు సంవత్సరాలుగా ఎంతోమంది రైతులు నష్టపోగా.. కేవలం 2018-19 సంవత్సరానికి సంబంధించి 60 వేల మంది రైతులకు మాత్రమే రూ.148.9 కోట్లు పరిహారం విడుదల చేయడంపై ప్రభుత్వ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇకపోతే.. 2019-20, 2020-21 సంవత్సరాలకు సంబంధించి కేంద్రం కనీసం స్పందించలేదు.
Also read:
Passenger Trains: రైల్వే ప్రయాణికులకు బిగ్ న్యూస్.. పూర్తిస్థాయిలో పట్టాలెక్కేది ఎప్పుడంటే..