
అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల సోదర భావానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి. అయితే రక్షాబంధన్ అంటే కేవలం మనుషులకు మాత్రమే కాదని, మూగజీవులకు కూడా వర్తిస్తుందని నిరూపించారు జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన జంతు ప్రేమికురాలు దేవగిరి భార్గవి. రాఖీ పౌర్ణమి పర్వదినాన ఆమె తన పెంపుడు గోవులకు రాఖీలు కట్టి తన మమకారాన్ని, సోదర భావాన్ని చాటుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. దేవగిరి భార్గవి అనే జంతు ప్రేమికురాలు రాఖీ పౌర్ణమి రోజు పెంపుడు గోవుల పట్ల తన ఆప్యాయతను చాటింది.. పెంపుడు గోవులకు రాఖీలు కట్టి సోదర భావాన్ని చాటింది వేదమంత్రాల నడుమ గోవులకు తిలకం దిద్ది, రాఖీలు కట్టి, దీపహారతి ఇచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సాధారణంగా పంచే మిఠాయిలకు బదులుగా ఆ గోవులకు అరటి పండ్లు, ఆకుకూరలు తినిపించి ఆ కుటుంబం తమ ప్రేమాభిమానాలను చాటుకుంది.
గోమాతలతో నిర్వహించిన ఈ రక్షాబంధన్ వేడుకలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. మూగజీవుల పట్ల ఆమె చూపిన ఆప్యాయతను చూసి గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.