AC Type mirchi: రికార్డు ధర పలికిన ఎర్రబంగారం.. మార్కెట్‌ చరిత్రలోనే తొలిసారిగా అత్యధిక రేటు..

ఎర్రబంగారం రైతుల్నని మురిపించింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏసీ మిరపకు రికార్డు ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే తొలిసారి క్వింటాలుకు ఏకంగా..

AC Type mirchi: రికార్డు ధర పలికిన ఎర్రబంగారం.. మార్కెట్‌ చరిత్రలోనే తొలిసారిగా అత్యధిక రేటు..
Ac Type Mirchi

Updated on: Jul 15, 2022 | 10:50 AM

AC Type mirchi : ఎర్రబంగారం రైతుల్ని మురిపించింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏసీ మిరపకు రికార్డు ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే తొలిసారి క్వింటాలుకు ఏకంగా రూ. 22,800 చొప్పున పలకడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీ రకం మిర్చిని అల్లిపురానికి చెందిన రావూరి సత్యనారాయణ అనే రైతు పండించాడు. ఈ నేపథ్యంలో.. రావూరి సత్యనారాయణ పండించిన మిరప పంటను ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చాడు. రావూరి సత్యనారాయణ తీసుకువచ్చిన 22 బస్తాల మిర్చిని క్వింటాలుకు రూ. 22,800 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు.

మార్కెట్‌కు మొత్తం 5,546 బస్తాల ఏసీ మిరప బస్తాలు రాగా, ఎండు మిరప 2,058 బస్తాలు, తాలు మిరప 265 బస్తాల సరుకు వచ్చినట్టు తెలిపారు మార్కెట్ అధికారులు. కాగా, తేజ రకం మిర్చికి అత్యధిక ధర పలుకుతుండడంతో శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన సరుకును కూడా తెచ్చి విక్రయిస్తున్నారు. కాగా, ఈ నెల 1న ఏసీ మిరప క్వింటాలుకు రూ.22 వేలు పలకింది. కాగా, మార్కెట్లు నిన్న మిరప కనిష్ఠ ధర రూ. 17,600గా ఉండగా, నమూనా ధర రూ. 20వేలు దాటి పలకడం విశేషంగా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us