Hyderabad: ఛీ..ఛీ అసలు వీడు మనిషేనా.. మద్యం కోసం డబ్బుల్లేవని.. మనవడ్నే అమ్మేశాడు

|

May 17, 2023 | 1:47 PM

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తాగుడు కోసం తన మనువడినే అమ్మేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే హాకీంపేట్ లో ఖలీల్(40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.

Hyderabad: ఛీ..ఛీ అసలు వీడు మనిషేనా.. మద్యం కోసం డబ్బుల్లేవని.. మనవడ్నే అమ్మేశాడు
Alcohol
Follow us on

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తాగుడు కోసం తన మనువడినే అమ్మేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే హాకీంపేట్ లో ఖలీల్(40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మద్యానికి బానిసగా మారిన ఖలీల్ తన భార్యతో, కుటుంబ సభ్యులతో తరచూ గొడవలు పడే వాడు. నిత్యం మద్యం సేవిస్తూ సోమరిగా తిరుగుతుంటాడు. తాగడానికి డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులను వేధించేవాడు. వారు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోకపోతే ఇంట్లో ఉన్న వస్తువులను అమ్మి మరీ.. మద్యం తాగేవాడు. ఈ క్రమంలో ఖలీల్ కుమార్తె ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. అలానే ఇటీవలే మగబిడ్డకు జన్మిచ్చింది. ఇదే సమయంలో రెండు రోజుల క్రితం ఖలీల్ డబ్బుల కోసం ఇంట్లో వారితో గొడవలు పడ్డాడు. వారు డబ్బులు లేవని చెప్పడంతో ఆగ్రహానికి గురయ్యాడు.

ఇంట్లో వాళ్లు పనుల్లో ఉండగా .. గుట్టు చప్పుడు కాకుండా మనవడిని ఖలీల్ ఎత్తుకెళ్లాడు. చివరికి ఆ బాబును అమ్మేసి.. వచ్చిన డబ్బులతో మద్యం సేవించాడు. ఇదే సమయంలో బాబు కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఎంతవరకు వెతికిన కొడుకు కనిపించడంలేదని ఖలీల్ కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. తన మనువడ్ని అమ్మేసినట్లు ఖలీల్ అంగీకరించాడు. అతను చెప్పిన ఆధారంగా చిన్నారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే మద్యం డబ్బుల కోసం సొంత మనవడినే అమ్మిన ఖలీల్‌పై స్థానికులు మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..