Telangana: టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఆత్మహత్య​.. అతని ఇన్​స్టాగ్రాం బయోలో రాసింది చూసి షాక్

|

Jul 21, 2022 | 8:58 AM

ఫ్రెండ్‌కి ఇన్ స్టాలో బర్త్ డే విషెస్ తెలిపాడు. అంతలోనే సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఇంతలో.. అతను ఇన్ స్టా బయోలో రాసిన విషయాన్ని చదివి ఒక్కసారిగా అందరూ షాక్​ అయ్యారు.

Telangana: టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఆత్మహత్య​.. అతని ఇన్​స్టాగ్రాం బయోలో రాసింది చూసి షాక్
Boy Dies
Follow us on

Crime News: అతడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. అందరితో కలివిడిగా మాట్లాడతాడు. పెద్దలకు, స్నేహితులకు తెలిసి ఏ సమస్యా లేదు. కానీ ఉన్నపలంగా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే..  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district) ఇల్లందు(Yellandu)కు చెందిన శివలోకేశ్​(14) అలియాస్​ సోనూ టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. బాలుడి తండ్రి రవి స్థానికంగా టెంట్​హౌస్ నడుపుతూ ఫ్యామిలీని పోషిస్తున్నాడు. అయితే.. బుధవారం కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో శివలోకేశ్​ ఉరేసుకుని జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడు. బయటకు వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగి వచ్చేసరికి లోకేశ్​ ఫ్యాన్​ను వేలాడుతూ కనిపించాడు. వెంటనే ఇరుగుపొరుగువారి సాయంతో.. లోకేశ్​ను గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మరణించినట్టు డాక్టర్లు నిర్థారించారు. దీంతో అతని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కాగా లోకేశ్​.. సూసైడ్ చేసుకునే ముందు తన ఫ్రెండ్ గౌతమ్​కు ఇన్​స్టాగ్రాంలో బర్త్ డే విషెడ్ తెలిపాడు. కాసేపటికే చనిపోయాడన్న తెలిసేసరికి.. స్నేహితులు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ క్రమంలోనే లోకేశ్​ ఫ్రెండ్స్.. అతని ఇన్​స్టాగ్రాం ఫ్రొఫైల్​ చూశారు.  బయోలో రాసిన విషయాన్ని చదివి ఒక్కసారిగా కంగుతిన్నారు. బయోలో తన మరణతేది 20 జులైగా రాసి ఉండటాన్ని చూసి.. షాకయ్యారు. వెంటనే ఈ విషయాన్ని పెద్దలకు చెప్పారు.  తాను చనిపోవాలని ముందే డిసైడయ్యి.. దాని కోసం డేట్ కూడా ఫిక్స్ చేసి.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో రాయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. బాలుడి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..