Samsung A04s: ప్రముఖ స్మార్ట్ ఫోన్ (Smartphone) దిగ్గజ సంస్థ సామ్సంగ్ తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్ తెచ్చే పనిలో పడింది. ఇప్పటికే గ్యాలక్సీ ఏ03ఎస్ని తీసుకొచ్చిన సామ్సంగ్ తాజాగా ఈ ఫోన్కు లేటెస్ట్ వెర్షన్గా గ్యాలక్సీ ఏ04ఎస్ స్మార్ట్ ఫోన్ను తీసుకురానున్నారు. తక్కువ బడ్జెట్లో లాంచ్ చేయనున్న ఈ స్మార్ట్ ఫోన్కు సంబంధించిన ఫీచర్లు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఈ వివరాల ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్లో 6.5 ఇంచెస్ డిస్ప్లేను అందించనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 12 వేల లోపు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో మూడు రెయిర్ కెమరాలను అందించనున్నారు. వీటిలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు, 2 మెగాపిక్సెల్ మాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లను అందించారు. సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ఇక స్టోరేజ్ పరంగా చూస్తే 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ అందించనున్నారు. ఇక ఇందులో 5000 ఎంఏహెచ్ సామర్థం ఉన్న బ్యాటరీని అందించనున్నారు. స్మార్ట్ఫోన్ను 0.91 సెంటీమీటర్లుగా ఉండనుంది. సామ్సంగ్ ఏ04ఎస్ ఫోన్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్పై ఈ ఫోన్ పనిచేయనుంది.ఈ ఫోన్కు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.
మరిన్ని టెక్నాలజీ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..
PM Modi Europe Visit: యూరప్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే!