5g Network: 5జీ సేవలు అందుబాటులోకి రాకముందే ప్లాన్‌ ధరలు పెగనున్నాయా…? నివేదికలు ఏం చెబుతున్నాయి?

|

Aug 07, 2022 | 8:38 AM

5g Network: రిలయన్స్ జియో ఆగస్టు 15న 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇది కాకుండా ఎయిర్‌టెల్, వొడాఫోన్ కూడా 5జీ సేవల కోసం..

5g Network: 5జీ సేవలు అందుబాటులోకి రాకముందే ప్లాన్‌ ధరలు పెగనున్నాయా...? నివేదికలు ఏం చెబుతున్నాయి?
5g
Follow us on

5g Network: రిలయన్స్ జియో ఆగస్టు 15న 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇది కాకుండా ఎయిర్‌టెల్, వొడాఫోన్ కూడా 5జీ సేవల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల, 5G స్పెక్ట్రమ్ వేలం సమయంలో, Jio 24,740 MHz స్పెక్ట్రమ్‌ను రూ. 88078 కోట్లకు కొనుగోలు చేసింది. ఎయిర్‌టెల్ 19867.8MHzని రూ. 43084 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది కాకుండా, Vodafone Idea 3300MHz మిడ్ బ్యాండ్ 5G స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ తన 5G సేవలను ఆగస్టు 15 నాటికి ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌తో ప్యానల్ ఇండియా 5జీని విడుదల చేయబోతున్నామని ఆకాష్ అంబానీ చెప్పారు. జియో ప్రపంచ స్థాయి, సరసమైన 5G సేవలను ప్రారంభించేందుకు కట్టుబడి ఉందన్నారు. కంపెనీలు తమ టారిఫ్‌ల రేట్లను పెంచవచ్చని చాలా నివేదికలు పేర్కొన్నాయి. ఈ సుంకం పెరుగుదల రెండంకెల వరకు ఉంటుందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నరు. అయితే, ఇప్పటి వరకు ధరలకు సంబంధించి కంపెనీలు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

వేల కోట్ల రూపాయలు వేలం వేయబడ్డాయి

ఇవి కూడా చదవండి

ఈ 5G వేలం ప్రక్రియలో దాదాపు 71 శాతం ఎయిర్‌వేవ్‌లు 1.5 ట్రిలియన్ రూపాయలకు వేలం వేశాయి. అటువంటి పరిస్థితిలో ఈ మొత్తాన్ని భర్తీ చేయడానికి చాలా మంది టెలికాం ఆపరేటర్లు తమ ప్లాన్‌ల ధరను పెంచాల్సి ఉంటుంది. భారీ SUC పొదుపులతో, టెలికాం ఆపరేటర్లు వార్షిక స్పెక్ట్రమ్ వ్యయాన్ని కవర్ చేయడానికి రెండు చర్యలను ఎంచుకోవలసి ఉంటుందని నోమురా రీసెర్చ్ తెలిపింది. మొదటి ఎంపిక ప్రకారం, ఆపరేటర్లు ఇంక్రిమెంటల్ టారిఫ్‌ను 4 శాతం పెంచాలి. రెండవ ఎంపిక ప్రకారం, టెలికాం ఆపరేటర్లు 5G ప్లాన్‌లపై 84 రోజుల చెల్లుబాటు, 1.5 GB రోజువారీ డేటాతో ప్రసిద్ధ 4G ప్లాన్‌లపై 30 శాతం ఎక్కువ ప్రీమియం ఛార్జీని వసూలు చేయవచ్చు.

Jio అత్యధిక ధరను పెంచవచ్చు..?

నివేదికల ప్రకారం.. భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ రీఛార్జ్ ప్లాన్‌లను సుమారు 2 శాతం పెంచవచ్చని తెలుస్తోంది., అయితే రిలయన్స్ జియో అత్యధిక బిడ్డర్‌గా ఉంది. దీని కారణంగా దాని ప్లాన్‌లను 7 శాతం వరకు పెంచే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి