
ఈ రోజుల్లో ఆన్లైన్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసగిస్తున్నారు. పాట్నాకు చెందిన ఒక మహిళ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఆమె ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుండి కొన్ని వస్తువులను ఆర్డర్ చేసింది. వస్తువులు సమయానికి రాలేదు. వెంటనే ఆమె కంపెనీనీ సంప్రదించాలని భావించింది. ఇందు కోసం ఇంటర్నెట్లో కంపెనీ నంబర్ను సంపాదించి కాల్ చేసింది. ఇంకెముంది స్కామర్ల ఉచ్చులో చిక్కుకుంది. స్కామర్లు ఆమె నుంచి వేలాది రూపాయలు క్షణాల్లోనే మంయ చేశారు.
మోసం ఎలా జరిగింది?
పాట్నాకు చెందిన ఒక మహిళ ఫిబ్రవరి 6న మిక్సర్ మెషీన్ను ఆర్డర్ చేసింది. ఈ ఉత్పత్తి ఫిబ్రవరి 12 నాటికి రావాల్సి ఉంది. అది సమయానికి రాకపోవడంతో ఆ మహిళ కారణం తెలుసుకోవడానికి కంపెనీని సంప్రదించాలని నిర్ణయించుకుంది. దీని తర్వాత ఆమె ఇంటర్నెట్లో కంపెనీ నంబర్ కోసం వెతికింది. తర్వాత ఆ నంబర్ను సంప్రదించినప్పుడు, కాల్ స్కామర్లకు వెళ్లింది. స్కామర్లు తమ మాటలతో ఆమెను ఆకర్షించి అవసరమైన సమాచారాన్ని సేకరించారు. ఇంకేముందు ఆ మహిళ ఖాతా నుండి రూ. 52,000 విత్డ్రా చేసుకున్నారు. దీని తర్వాత ఆ మహిళ ఈ సంఘటన తర్వాత మోసపోయానని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: PM Kisan: Air Coolers: సగం ధరకే ఎయిర్ కూలర్లు.. వేసవి రాకముందే భారీ డిస్కౌంట్లు!
ఇలాంటి మోసాలను ఎలా నివారించాలి?
ఇలాంటి మోసాలను నివారించడానికి జాగ్రత్తలు ఉండటం చాలా ముఖ్యం. ఇంటర్నెట్లో లభించిన నంబర్లకు ఫోన్ చేయవద్దు. ఏదైనా కంపెనీకి కాల్ చేయడానికి ఇంటర్నెట్ నుండి కాకుండా కంపెనీ అధికారిక వెబ్సైట్ నుండి నంబర్ను పొందడం ఉత్తమం. ఇంటర్నెట్లో ఉన్న నంబర్లు స్కామర్లకు చెందినవి కావచ్చు. ఇది కాకుండా, మీ సున్నితమైన సమాచారాన్ని ఫోన్ కాల్, ఇమెయిల్ లేదా సందేశం ద్వారా తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు. కంపెనీ ప్రతినిధులు OTP వంటి సున్నితమైన సమాచారాన్ని అడగరు. దీనితో పాటు, ఎవరైనా మిమ్మల్ని చెల్లింపు చేయమని అడిగితే ముందుగా దాన్ని ధృవీకరించండి. తెలియని వ్యక్తి పంపిన లింక్ లేదా QR కోడ్ను స్కాన్ చేయవద్దు. దీని ద్వారా మీకు తెలియకుండానే మీ ఫోన్లో మాల్వేర్ను ఇన్స్టాల్ చేయవచ్చు. ఇది మీ ఫోన్ నియంత్రించడాన్ని వారికి సులభతరం చేస్తుంది.
ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు శుభవార్త.. ఈనెల 24న పీఎం కిసాన్ డబ్బులు.. వీరికి మాత్రం రావు!
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి