AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio True5G: జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 850 ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలు

తెలంగాణలోని ప్రముఖ మొబైల్‌ నెట్‌వర్క్‌ జియో మొబైల్ వినియోగదారుల మరిన్ని సేవలు కల్పిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 850కిపైగా ప్రధాన ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రిలయన్స్‌ జియో తెలిపింది. ఈ లాంచ్ దాని వినియోగదారులకు ఉత్తమమైన ట్రూ 5G అనుభవాన్ని..

Jio True5G: జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 850 ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలు
Jio True 5g
Subhash Goud
|

Updated on: Jun 05, 2023 | 7:04 PM

Share

తెలంగాణలోని ప్రముఖ మొబైల్‌ నెట్‌వర్క్‌ జియో మొబైల్ వినియోగదారుల మరిన్ని సేవలు కల్పిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 850కిపైగా ప్రధాన ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రిలయన్స్‌ జియో తెలిపింది. ఈ లాంచ్ దాని వినియోగదారులకు ఉత్తమమైన ట్రూ 5G అనుభవాన్ని అందించడానికి జియో నిబద్ధతలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని పేర్కొంది.

Jio True 5G ఈ అన్ని ప్రాంతాల్లోని వినియోగదారులకు 1 Gbps+ వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. జియో వెల్‌కమ్ ఆఫర్ ద్వారా పూర్తిగా ఉచితం. జియో ట్రూ 5G నెట్‌వర్క్ ఈ ప్రాంతాల్లోని ముఖ్యమైన ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు, విద్యా సంస్థలు, మాల్స్, మార్కెట్లు, నివాస ప్రాంతాలు, ఆసుపత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ భవనాలు, ఇతర ముఖ్యమైన వాణిజ్య సంస్థలను కవర్ చేస్తుంది. అదనంగా ఈ 850 ప్రాంతాలకు ఆనుకుని ఉన్న అనేక పట్టణాలు, గ్రామాలు కూడా జియో ట్రూ 5జీ కనెక్టివిటీ నుంచి ప్రయోజనం పొందనున్నారు.

ఈ సందర్భంగా నెట్‌వర్క్ విస్తరణపై జియో ప్రతినిధి మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రధాన కార్యాలయాలు, 850కి పైగా ప్రధాన ప్రదేశాలలో జియో ట్రూ 5G సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సంతోషిస్తున్నామని అన్నారు. 2023 డిసెంబర్ చివరి నాటికి దేశవ్యాప్తంగా ప్రతి పట్టణాలు, తాలూకాలో ట్రూ 5G సేవలను ప్రారంభించేందుకు జియో ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను కలిగి ఉంది. ఈ దేశవ్యాప్త విస్తరణ జియో ట్రూ 5G నెట్‌వర్క్ అసమానమైన సామర్థ్యాలతో వినియోగదారులను శక్తివంతం చేస్తుంది. తద్వారా వారు పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునేలా చేస్తుంది. అధునాతన సాంకేతికత జియో ట్రూ 5G మూడు రెట్లు ప్రయోజనాన్ని కలిగి ఉంది. ఇది భారతదేశంలోని ఏకైక ట్రూ 5G నెట్‌వర్క్‌గా ఉందని అన్నారు. ముందుగా ఇది 4G నెట్‌వర్క్‌పై ఆధారపడకుండా 5జీ నెట్‌వర్క్‌ అందుకోవచ్చన్నారు. ఈ 5G ఫ్రీక్వెన్సీలను సజావుగా మిళితం చేసి, మొత్తం కనెక్టివిటీ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. జియో ట్రూ 5జీ సేవలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శర వేగంగా విస్తరించేలా చర్యలు చేపడుతున్నామన్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి