
Google Emergency Location Service: గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారుల కోసం భారతదేశంలో ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్ (ELS) ను ప్రారంభించింది. ముఖ్యంగా ఈ సేవను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 112 నంబర్కు అత్యవసర సేవ ఇప్పుడు ఖచ్చితమైన స్థాన సమాచారాన్ని అనుసంధానిస్తుంది. ఎందుకంటే ప్రమాదకరమైన పరిస్థితి, గాయం, ప్రమాదం లేదా భయాందోళన వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తరచుగా తమ ఖచ్చితమైన స్థానాన్ని అందించడానికి ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితులలో గూగుల్ నుండి ఈ కొత్త సర్వీస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఆండ్రాయిడ్ 6.0 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం గూగుల్ ఈ సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీసు కోసం ప్రత్యేక యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలోనే ఇంటర్నల్గా ఉంటుంది. 112కు డయల్ చేయడం లేదా టెక్స్ట్ పంపడం ద్వారా మీరు మీ ఖచ్చితమైన స్థానం గురించి అగ్నిమాపక దళం, అంబులెన్స్, పోలీసులకు నోటిఫికేషన్ పంపవచ్చు.
దీని కోసం ఆండ్రాయిడ్ వినియోగదారులు ప్రత్యేక యాప్ను డౌన్లోడ్ చేసుకోవలసిన అవసరం లేదు. ఇది ఇప్పటికే అందుబాటులో ఉంది. ఇది వినియోగదారులకు భారీ ప్రయోజనం చేకూరుస్తుంది.
ఈ సర్వీసును మొదట భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు, స్థానిక సాంకేతిక భాగస్వాములతో కలిసి 112 అత్యవసర వ్యవస్థపై పని ప్రారంభించారు. ప్రారంభంలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఇది ఉత్తరప్రదేశ్లో మాత్రమే అమలు చేశారు. కానీ త్వరలో ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని గూగుల్ పేర్కొంది.
ఈ ఫీచర్ మొబైల్ నెట్వర్క్లు, GPS, Wi-Fi లను ఉపయోగించి 50 మీటర్ల వ్యాసార్థంలో కాలర్ ఖచ్చితమైన స్థానాన్ని నిర్ణయిస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఫీచర్ అత్యవసర కాల్స్ సమయంలో మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. ఇది వినియోగదారు గోప్యతను నిర్ధారిస్తుంది. అంతేకాకుండా వినియోగదారుల లోకేషన్లను గూగుల్ స్టోర్ చేయదు. అవి నేరుగా అత్యవసర సేవలకు పంపిస్తుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వినియోగదారులు Google కొత్త అత్యవసర సర్వీసు ద్వారా అత్యవసర కాల్ చేయవచ్చు. దీని ద్వారా తక్షణ సహాయం పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి