కార్బన్ డై ఆక్సైడ్ కి చెక్.. పర్యావరణానికి బూస్ట్

ప్రపంచ దేశాల్లో పర్యావరణం దారుణంగా దెబ్బ తింటోంది. వాతావరణంలో ఒక్క గత నెలలోనే హానికారక కార్బన్ డై ఆక్సైడ్ మిలియన్ కు 415 భాగాలకు పైగా మించిపోయింది. ఇది మానవ చరిత్రలోనే అత్యధికమని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలు క్లైమేట్ క్రైసిస్ దిశగా పయనిస్తున్నాయని వారంటున్నారు. . దీనికి చెక్ చెప్పి కార్బన్ వాయువులను తగ్గించాల్సి ఉందని, ఇందుకు మొదట వాతావరణం నుంచి పూర్తిగా కార్బన్ ను తొలగించి భూతలం లోపల ‘ […]

కార్బన్ డై ఆక్సైడ్ కి చెక్.. పర్యావరణానికి బూస్ట్
Follow us

|

Updated on: Jun 13, 2019 | 7:20 PM

ప్రపంచ దేశాల్లో పర్యావరణం దారుణంగా దెబ్బ తింటోంది. వాతావరణంలో ఒక్క గత నెలలోనే హానికారక కార్బన్ డై ఆక్సైడ్ మిలియన్ కు 415 భాగాలకు పైగా మించిపోయింది. ఇది మానవ చరిత్రలోనే అత్యధికమని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలు క్లైమేట్ క్రైసిస్ దిశగా పయనిస్తున్నాయని వారంటున్నారు. . దీనికి చెక్ చెప్పి కార్బన్ వాయువులను తగ్గించాల్సి ఉందని, ఇందుకు మొదట వాతావరణం నుంచి పూర్తిగా కార్బన్ ను తొలగించి భూతలం లోపల ‘ స్టోర్ ‘ చేయాలని వారు సూచిస్తున్నారు. ఇది ఓ సైన్స్ ఫిక్షన్ లా ఉండవచ్ఛు . కానీ భూమ్మీది చెట్లు ఈ పనిని ఇదివరకే చేస్తున్నాయి అన్నది వారి కొత్త వాదన. చెట్లు, మొక్కలు వెదర్ లోని కర్బనాన్ని పీల్చుకుని తమ వేళ్ళ ద్వారా భూమిలోకి పంపి దాన్ని నాశనం చేస్తున్నాయని వారు సూత్రీకరించారు. అందువల్లే కొన్ని కంపెనీలు తప్పనిసరిగా చెట్లను పెంచుతూ తరచూ తమ ఫ్యాక్టరీలు, సంస్థలనుంచి వెలువడే ఈ వాయువులను వాటికి వదిలివేస్తున్నాయని బోస్టన్ లోని ‘ ఇండిగో ఏజీ ‘ వెల్లడించింది. ఈ దిశగా ఈ సంస్థ వ్యవసాయ విధానాలను పూర్తిగా మార్చివేయడానికి పూనుకొంది. ప్రస్తుత పధ్ధతి ప్రకారం కాకుండా కొత్త విధానాలను సూచించింది. రైతులు తమ పాత విధానాలను మార్చుకునేలా వారికి ‘ టన్ను’ కార్బన్ డై ఆక్సైడ్ కు 15 డాలర్ల చొప్పున చెల్లిస్తామని డేవిడ్ పెర్రీ అనే ఈ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రకటించారు. తాము మొదట సుమారు మూడు వేలమంది రైతులకు శిక్షణ ఇస్తామని, వారి పొలాల్లోని కార్బన్ డై ఆక్సైడ్ ని చెట్లు పీల్చుకునేలా నిపుణులు సూచనలు, ఇస్తారని ఆయన చెప్పారు. ఈ ఏడాది పది లక్షలకు పైగా ఎకరాల్లో కర్బనం అన్నది లేకుండా చేయాలన్నది తమ లక్ష్యమని ఆయన చెప్పారు. అయితే ఈ సరికొత్త కర్బన నిర్మూలన కార్యక్రమం ఫలవంతమవుతుందా అని కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో ఎప్పటికప్పుడు సంభవిస్తున్న మార్పులు కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణాలను పెంచుతూ పోతాయని, అలాంటప్పుడు ఇది ప్రకృతితో చేసే పోరాటంవంటిదేనని ఈ ‘ నిరాశావాదులు ‘ అంటున్నా వీరి వాదనను డేవిడ్ పెర్రీ కొట్టిపారేస్తున్నారు.

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..