Delhi Metro: మెట్రో పింక్ లైన్‌లో పరుగులు పెట్టిన డ్రైవర్‌లెస్ రైలు.. దేశంలో అందుబాటులోకి తొలి DTO నెట్‌వర్క్ సిస్టమ్

ఢిల్లీ మెట్రో పింక్ లైన్‌లో డ్రైవర్‌లెస్ రైలు గురువారం నుంచి ప్రారంభమైంది. ఢిల్లీ మెట్రోలోని మజ్లిస్ పార్క్ నుండి శివ్ విహార్ మధ్య 59 కి.మీ పొడవైన పింక్ లైన్ ఈ రైలు పరుగులు తీసింది.

Delhi Metro: మెట్రో పింక్ లైన్‌లో పరుగులు పెట్టిన డ్రైవర్‌లెస్ రైలు.. దేశంలో అందుబాటులోకి తొలి DTO నెట్‌వర్క్ సిస్టమ్
Driverless Train Copy

Updated on: Nov 25, 2021 | 4:36 PM

Delhi Metro Rail DTO Network System: ఢిల్లీ మెట్రో పింక్ లైన్‌లో డ్రైవర్‌లెస్ రైలు గురువారం నుంచి ప్రారంభమైంది. ఢిల్లీ మెట్రోలోని మజ్లిస్ పార్క్ నుండి శివ్ విహార్ మధ్య 59 కి.మీ పొడవైన పింక్ లైన్ ఈ రైలు పరుగులు తీసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ ఫ్లాగ్ ఆప్ చేసి ప్రారంభించారు. దీంతో ఢిల్లీ మెట్రో పూర్తిగా ఆటోమేటెడ్ నెట్‌వర్క్ దాదాపు 97 కి.మీలకు పెరిగింది. ఇది ప్రపంచంలో నాల్గవ అతిపెద్దది కాగా, భారతదేశంలోని ఏకైక DTO నెట్‌వర్క్ సిస్టమ్ కావడం విశేషం.

మెజెంటా లైన్‌లో DTO సౌకర్యం 2020 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. దీంతో ఢిల్లీ మెట్రో పూర్తిగా ఆటోమేటెడ్ మెట్రో నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్న ప్రపంచంలోని 7% మెట్రోల ఎలైట్ గ్రూప్‌లోకి ప్రవేశించింది. డ్రైవర్ లేని రైలు కార్యకలాపాలలో మరింత సౌలభ్యాన్ని ఉంటుందని ఆధికారులు తెలిపారు. మానవ జోక్యం, మానవ తప్పిదాలను తగ్గిస్తాయి. ఇది కోచ్‌ల లభ్యతను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని అధికారులు వెల్లడించారు.


డ్రైవర్‌లేని రైళ్లు ప్రీ-ఇండక్షన్ చెకింగ్ మాన్యువల్ ప్రక్రియను తొలగిస్తాయి. అంతేకాదు రైలు ఆపరేటర్లపై భారాన్ని తగ్గిస్తాయి. డిపోలోని స్టెబ్లింగ్ లైన్‌లో ఆటోమేటిక్‌గా పార్కింగ్ కూడా జరుగుతుంది. ప్రయాణీకుల సేవ కోసం కోచ్‌ల లభ్యత పెరగడంతో DMRC మెజెంటా లైన్‌లో డ్రైవర్‌లెస్ కార్యకలాపాల ప్రయోజనాన్ని పొందడం ప్రారంభించింది. రోజువారీ ప్రయాణీకుల సేవలో చేర్చడానికి ముందు స్వీయ-పరీక్షలు నిర్వహించడం వల్ల రైళ్ల విశ్వసనీయత అనేక రెట్లు పెరిగింది. దీని కారణంగా మానవ తప్పిదానికి సంబంధించిన అన్ని అవకాశాలు స్వయంచాలకంగా తొలగించుకుంటుంది.

డ్రైవర్‌లెస్ రైలు నిర్వహణలో సుదీర్ఘ నెట్‌వర్క్‌తో మరింత లాభం పెరుగుతుంది. DTOలో మొదట్లో రైలు ఆపరేటర్ రైలులో సహాయం చేయడానికి, ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి ఉంటారు. DTO హై-ఎండ్ డయాగ్నస్టిక్ ఫీచర్లు సాంప్రదాయ సమయ-ఆధారిత నిర్వహణ నుండి స్థాన-ఆధారిత నిర్వహణకు మారడంలో సహాయపడతాయి. దీంతో రైళ్ల నిర్వహణ సమయం కూడా తగ్గుతుంది.

ఫేజ్-IV పూర్తయిన తర్వాత, ఏరోసిటీ-తుగ్లకాబాద్ సిల్వర్ లైన్‌తో పాటు పింక్ మరియు మెజెంటా లైన్‌ల విస్తరణ ప్రారంభమైనప్పుడు, DMRC 160 కిలోమీటర్లు నడుస్తుంది. DTO ఎనేబుల్డ్ కారిడార్‌తో ప్రపంచంలోని రెండవ అతిపెద్ద డ్రైవర్‌లెస్ మెట్రో నెట్‌వర్క్ అవుతుంది.

Read Also… NTPC Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పోస్టులు..

Ganna or Jinna: జిన్నాపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్.. ఇంతకీ ఎమన్నారంటే..?

Loading...
Unable to load recommendations.
Follow Us