Chinese Smartphones: చైనాకు భారీ షాకిచ్చేందుకు సిద్ధమవుతున్న భారత్‌.. అదేంటో తెలుసా..?

|

Aug 09, 2022 | 6:50 AM

Chinese Smartphones: బడ్జెట్ విభాగంలో చైనీస్ కంపెనీల ఆధిపత్యం చాలా ఉంది. భారతీయ మార్కెట్లో చౌక స్మార్ట్‌ఫోన్‌లకు కస్టమర్‌లలో చాలా క్రేజ్ ఉంది. అయితే చైనా కంపెనీల..

Chinese Smartphones: చైనాకు భారీ షాకిచ్చేందుకు సిద్ధమవుతున్న భారత్‌.. అదేంటో తెలుసా..?
Smartphone
Follow us on

Chinese Smartphones: బడ్జెట్ విభాగంలో చైనీస్ కంపెనీల ఆధిపత్యం చాలా ఉంది. భారతీయ మార్కెట్లో చౌక స్మార్ట్‌ఫోన్‌లకు కస్టమర్‌లలో చాలా క్రేజ్ ఉంది. అయితే చైనా కంపెనీల కారణంగా, దేశీయ హ్యాండ్‌సెట్ తయారీదారులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా రూ.12,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తున్న చైనా కంపెనీలకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంటు ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోందని ఓ రిపోర్ట్ బయటకు వచ్చింది . చైనీస్ కంపెనీలు బడ్జెట్ విభాగంలోకి దూసుకెళ్లిన తర్వాత లావా, మైక్రోమ్యాక్స్ వంటి దేశీయ హ్యాండ్‌సెట్ తయారీదారులు తమ మార్కెట్ వాటాను కోల్పోయాయి. దేశీయ హ్యాండ్‌సెట్ తయారీదారులను ఆదుకోవడమే భారత ప్రభుత్వ ఉద్దేశం, అయితే అదే సమయంలో చైనా కంపెనీలకు కూడా గట్టి దెబ్బ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 12,000 రూపాయల బడ్జెట్‌లో వస్తున్న చైనీస్ స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్ నుండి దశలవారీగా నిలిపివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

భారత ప్రభుత్వం ఇంత కఠినమైన చర్య తీసుకుంటే అది Xiaomiతో సహా ఇతర చైనా కంపెనీలకు పెద్ద ఎదురుదెబ్బను కలిగిస్తుందనే చెప్పాలి. ప్రస్తుతానికి ఈ ధరల శ్రేణిలో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్న చైనా కంపెనీలకు షాక్ ఇచ్చేలా భారత ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రకటిస్తుందా లేదా అనధికారిక మార్గాల ద్వారా చైనా కంపెనీలకు తన సందేశాన్ని తెలియజేస్తుందా అనేది స్పష్టంగా తెలియలేదు. జూన్‌లో చైనా కంపెనీలు 80 శాతం ఆధిపత్యం చలాయించాయి. జూన్ త్రైమాసికంలో 12 వేల కంటే తక్కువ ధరలో వస్తున్న స్మార్ట్‌ఫోన్‌లలో 80 శాతం చైనా కంపెనీలవే.

భారత్‌లో చైనా కంపెనీల వ్యారాలకు ఇబ్బందులు:

ఇవి కూడా చదవండి

2020లో సరిహద్దులో రాజకీయ ఉద్రిక్తత తర్వాత చైనా కంపెనీలకు భారతదేశంలో వ్యాపారం చేయడం చాలా కష్టంగా మారింది. ప్రభుత్వం క్రమంగా చైనీస్ యాప్‌లను నిషేధించడం ప్రారంభించింది. ఇప్పుడు 12 వేల వరకు బడ్జెట్ సెగ్మెంట్ నుండి కూడా చైనా కంపెనీల నుండి బయటపడే మార్గం చూపడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి