Air Taxi: భారత్‌లో త్వరలో ఎయిర్ టాక్సీ సేవలు.. ఛార్జీలు ఎలా ఉంటాయో తెలుసా?

|

May 18, 2024 | 7:17 PM

తక్కువ సమయంలో సుదూర ప్రయాణాలను పూర్తి చేయడానికి ఎయిర్ టాక్సీలు సహాయపడతాయి. అలాగే దీని కోసం మీరు విమానాశ్రయానికి వెళ్లవలసిన అవసరం లేదు. ఇది కాకుండా, విమాన టిక్కెట్లతో పోలిస్తే ఎయిర్ టాక్సీ ఛార్జీలు కూడా చాలా తక్కువ. అందుకే రాబోయే రోజుల్లో ఇది ఏవియేషన్ స్టార్టప్‌గా పరిగణిస్తాయి..

Air Taxi: భారత్‌లో త్వరలో ఎయిర్ టాక్సీ సేవలు.. ఛార్జీలు ఎలా ఉంటాయో తెలుసా?
Air Taxi
Follow us on

తక్కువ సమయంలో సుదూర ప్రయాణాలను పూర్తి చేయడానికి ఎయిర్ టాక్సీలు సహాయపడతాయి. అలాగే దీని కోసం మీరు విమానాశ్రయానికి వెళ్లవలసిన అవసరం లేదు. ఇది కాకుండా, విమాన టిక్కెట్లతో పోలిస్తే ఎయిర్ టాక్సీ ఛార్జీలు కూడా చాలా తక్కువ. అందుకే రాబోయే రోజుల్లో ఇది ఏవియేషన్ స్టార్టప్‌గా పరిగణిస్తాయి.

ముందుగా దుబాయ్‌లో ఎయిర్ టాక్సీ సర్వీసును ప్రారంభం:

ఏవియేషన్ స్టార్టప్ జాబీ ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్ టాక్సీని ప్రారంభించబోతోంది. కంపెనీ త్వరలో దుబాయ్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ టాక్సీ సర్వీస్‌ను ప్రారంభించనుంది. స్టార్టప్ ఈ ఏడాది ప్రారంభంలో గల్ఫ్ ఎమిరేట్స్‌తో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ టాక్సీ 2025 నాటికి దుబాయ్‌లో పని చేస్తుంది. టయోటా వంటి ప్రముఖ కార్ కంపెనీ కూడా జాబీ ఏవియేషన్‌లో $394 మిలియన్లు పెట్టుబడి పెడుతోంది.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో ఎయిర్ టాక్సీ సేవలు ప్రారంభం

ఇంట్‌గ్లోబ్ ఏవియేషన్, ఆర్చర్ ఏవియేషన్ సంయుక్తంగా భారతదేశంలో ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభిస్తున్నాయి. ఢిల్లీలోని కన్నాట్ ప్యాలెస్ నుండి గురుగ్రామ్‌కు ఎయిర్ టాక్సీ సర్వీస్ 2026 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్-గురుగ్రామ్ మధ్య ప్రయాణాన్ని ఎయిర్ టాక్సీలో కేవలం 7 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. ఈ ఎయిర్ ట్యాక్సీలో పైలట్‌తో సహా ఐదుగురు ప్రయాణించవచ్చు. ముంబయి, బెంగళూరులో ఎయిర్ ట్యాక్సీలను కూడా ప్రారంభించే యోచనలో ఉంది.

టాక్సీ 150 కి.మీ

ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ ఎయిర్ టాక్సీని మిడ్‌నైట్ అంటారు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ నుంచి గురుగ్రామ్ వరకు 27 కిలోమీటర్ల ప్రయాణం ప్రస్తుతం 60 నుంచి 90 నిమిషాలు పడుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఎయిర్ టాక్సీ ద్వారా ఈ సమయాన్ని 7 నిమిషాలకు తగ్గించడమే మా లక్ష్యం. ఎయిర్ టాక్సీలో పైలట్ కాకుండా నలుగురు ప్రయాణికులు కూర్చోవచ్చు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 150 కి.మీ ప్రయాణించవచ్చు. ఆర్చర్ ఏవియేషన్ ప్రకారం.. కన్నాట్ ప్లేస్ నుండి గురుగ్రామ్ వరకు ఏడు నిమిషాల విమానంలో సుమారు 2 నుండి 3 వేల రూపాయలు ఖర్చు అవుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి