
ఆదిత్య-ఎల్1 సూర్యుని వైపు మరో అడుగు వేసింది. భూ కక్ష్యలో తిరుగుతున్న ఈ వ్యోమనౌక కొత్త కక్ష్యను చేరుకుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తెలిపింది. ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం తొలి భూకక్ష్య పెంపు విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో తెలిపింది. ప్రస్తుతం భూమిచుట్టూ తిరుగుతున్న ఆదిత్య ఎల్-1 కక్ష్యను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా మార్చారు.
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ X (ఇంతకుముందు ట్విట్టర్)లో సమాచారం ఇస్తూ.. ఆదిత్య-ఎల్ 1 మిషన్ రెండవ ఎర్త్ బౌండ్ విన్యాసాన్ని పూర్తి చేసిందని ఇస్రో తెలిపింది. అంటే సూర్యన్ తన రెండవ రౌండ్ భూమిని పూర్తి చేసింది.
ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్వర్క్ (ఐఎస్టీఆర్ఏసీ) ఈ ఆపరేషన్ను ఇస్రో సమన్వయం చేసింది. ఐఎస్టీఆర్ఏసీకి చెందిన మారిషస్, బెంగళూరు, పోర్ట్ బ్లెయిర్ గ్రౌండ్ స్టేషన్లు ఉపగ్రహాన్ని ట్రాక్ చేశాయని ఇస్రో వెల్లడించింది. ఇస్ట్రో అందించిన సమాచరం ప్రకారం.. సెప్టెంబర్ 5 తెల్లవారుజామున 2.45 గంటలకు భూమి కొత్త కక్ష్యలోకి ప్రవేశించింది ఆదిత్య-L 1.. కొత్త కక్ష్య 282 కిమీ X 40,225 కిమీ. భూమి నుంచి ఈ కక్ష్య కనిష్ట దూరం 282 కిమీ అయితే.. గరిష్ట దూరం 40,225 కిమీ అని సులభంగానే చేరుకుంది.
అంతకుముందు, సూర్యాన్ తన మొదటి కక్ష్యను సెప్టెంబర్ 3 న పూర్తి చేసింది. 245 కిమీ x 22,459 కిమీ కక్ష్యను సాధించింది.
ఇస్రోకు చెందిన పీఎస్ఎల్వీ-సీ57 రాకెట్ సాయంతో భూకక్ష్యలోకి ప్రవేశపెట్టారు. దీని ప్రారంభ కక్ష్య 235 కిలోమీటర్ల x 19000 కిలోమీటర్లు. సూర్యుడు మొత్తం 16 రోజుల పాటు (సెప్టెంబర్ 18) భూమి కక్ష్యలో ఉండాల్సి ఉంటుంది. ఈ రౌండ్ తర్వాత సూర్యుడి వైపు లాగ్రాంజ్ 1 పాయింట్కి నేరుగా బయలుదేరుతుంది. L1 పాయింట్ భూమి నుండి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇక్కడ సూర్యుడు, భూమి ఒకదానికొకటి గురుత్వాకర్షణను తటస్థీకరిస్తాయి, తద్వారా వస్తువులు ఇక్కడ చాలా తక్కువ శక్తితో ఉంటాయి. భూమి నుండి ఎల్1 పాయింట్కి చేరుకోవడానికి సూర్యన్ మొత్తం 125 రోజులు ప్రయాణించాలి.
Aditya-L1 Mission:
The second Earth-bound maneuvre (EBN#2) is performed successfully from ISTRAC, Bengaluru.ISTRAC/ISRO’s ground stations at Mauritius, Bengaluru and Port Blair tracked the satellite during this operation.
The new orbit attained is 282 km x 40225 km.
The next… pic.twitter.com/GFdqlbNmWg
— ISRO (@isro) September 4, 2023
ఇక.. కొద్ది రోజుల క్రితం చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ కాగా.. ఇప్పుడు ఆదిత్య మిషన్ కూడా విజయవంతంగా చక్కర్లు కొడుతుండటంతో ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అటు.. దేశ కీర్తిని విశ్వానికి చాటిన ఇస్రోను ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి.
మరిన్ని టెక్నాలజీ న్యూస్ కోసం