12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి…భళా హైదరాబాద్ టీమ్!
ఐపీఎల్ 2019 లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ లక్కీగా ప్లేఆఫ్ బెర్తుని దక్కించుకుంది. లీగ్ దశలో 14 మ్యాచ్లాడి కేవలం ఆరింట్లో మాత్రమే గెలుపొందిన హైదరాబాద్ టీమ్.. 12 పాయింట్లతో ప్లేఆఫ్కి చేరిన తొలి జట్టుగా ఐపీఎల్లో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. సన్రైజర్స్తో పాటు ప్లేఆఫ్ చేరిన ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 14 మ్యాచ్ల్లో ఏకంగా 9 మ్యాచ్ల్లో గెలుపొంది 18 పాయింట్లతో ప్లేఆఫ్కి చేరడం విశేషం. 16 పాయింట్లు […]
ఐపీఎల్ 2019 లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ లక్కీగా ప్లేఆఫ్ బెర్తుని దక్కించుకుంది. లీగ్ దశలో 14 మ్యాచ్లాడి కేవలం ఆరింట్లో మాత్రమే గెలుపొందిన హైదరాబాద్ టీమ్.. 12 పాయింట్లతో ప్లేఆఫ్కి చేరిన తొలి జట్టుగా ఐపీఎల్లో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. సన్రైజర్స్తో పాటు ప్లేఆఫ్ చేరిన ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 14 మ్యాచ్ల్లో ఏకంగా 9 మ్యాచ్ల్లో గెలుపొంది 18 పాయింట్లతో ప్లేఆఫ్కి చేరడం విశేషం. 16 పాయింట్లు సాధిస్తేనే ప్లేఆఫ్ చేరేందుకు జట్లకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. గత సీజన్లలో 14 పాయింట్లతోనే ప్లేఆఫ్కి చేరిన జట్లూ లేకపోలేదు. కానీ. కేవలం 12 పాయింట్లతోనే ప్లేఆఫ్ బెర్తు దక్కడం 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఇది తొలిసారి.
Qualified ?#OrangeArmy #RiseWithUs pic.twitter.com/fwxpQjqjfh
— SunRisers Hyderabad (@SunRisers) May 5, 2019
Here it is the #VIVOIPL Points Table after the league stage.
Onto the Playoffs now ?? pic.twitter.com/FULlVTcOFJ
— IndianPremierLeague (@IPL) May 5, 2019