వర్షం కారణంగా ఆలస్యం కానున్న మూడో టీ20 మ్యాచ్‌!

భారత్‌, వెస్టిండీస్‌ మూడో టీ20 మ్యాచ్‌ టాస్‌ ఆలస్యమైంది. ఉదయం నుంచి ప్రావిడెన్స్‌ స్టేడియంలో వర్షం కురుస్తోంది. పిచ్‌పై సిబ్బంది కవర్లు కప్పి ఉంచారు. మ్యాచ్‌ ప్రారంభానికి అరగంట ముందు వరుణదేవుడు తెరపినిచ్చాడు. ఔట్‌ఫీల్డ్‌ తడిగా ఉండటంతో టాస్‌ వేయలేదు. వరుసగా రెండు టీ20లు గెలిచిన టీమిండియా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేయాలని పట్టుదలతో ఉంది. కనీసం ఈ పోరైనా గెలిచి టీమిండియా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించాలని కరీబియన్‌ జట్టు కోరుకుంటోంది. తొలి ఇన్నింగ్స్‌లో […]

వర్షం కారణంగా ఆలస్యం కానున్న మూడో టీ20 మ్యాచ్‌!
Follow us

| Edited By:

Updated on: Aug 06, 2019 | 8:16 PM

భారత్‌, వెస్టిండీస్‌ మూడో టీ20 మ్యాచ్‌ టాస్‌ ఆలస్యమైంది. ఉదయం నుంచి ప్రావిడెన్స్‌ స్టేడియంలో వర్షం కురుస్తోంది. పిచ్‌పై సిబ్బంది కవర్లు కప్పి ఉంచారు. మ్యాచ్‌ ప్రారంభానికి అరగంట ముందు వరుణదేవుడు తెరపినిచ్చాడు. ఔట్‌ఫీల్డ్‌ తడిగా ఉండటంతో టాస్‌ వేయలేదు. వరుసగా రెండు టీ20లు గెలిచిన టీమిండియా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేయాలని పట్టుదలతో ఉంది. కనీసం ఈ పోరైనా గెలిచి టీమిండియా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించాలని కరీబియన్‌ జట్టు కోరుకుంటోంది. తొలి ఇన్నింగ్స్‌లో 140 పరుగులు చేసే జట్టుకు గెలుపు అవకాశాలు ఉంటాయని డారెన్‌ గంగా తెలిపాడు.