India Vs Australia 2020 : తన పై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తో సమాధానం చెప్పిన రిషబ్ పంత్

|

Jan 20, 2021 | 6:00 AM

డ్రాగా ముగిస్తే చాలు అనుకుంటున్న మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు రెచ్చిపోయారు. ఆసిస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించి.. 2-1తో నాలుగు టెస్టుల సిరీస్‌ను...

India Vs Australia 2020 : తన పై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తో సమాధానం చెప్పిన రిషబ్ పంత్
Follow us on

India Vs Australia 2020:  డ్రాగా ముగిస్తే చాలు అనుకుంటున్న మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు రెచ్చిపోయారు. ఆసిస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించి.. 2-1తో నాలుగు టెస్టుల సిరీస్‌ను, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. చరిత్ర లిఖించిన ఈ విజయంతో భారత జట్టు మరోసారి టెస్ట్ చాంపియన్‌షిప్‌లో టాప్ ప్లేసులో నిలిచింది. ఈ  టెస్టు సిరీస్‌తో భారత్ యువ వికెట్ కీపర్ జీరో నుంచి హీరో అయిపోయాడు.

మూడో టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌తో పాటు ఆఖరి టెస్టు చివరి ఇన్నింగ్స్‌లోనూ వీరోచితంగా బ్యాటింగ్ చేసి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చాడు. ఈ సందర్భంగా మ్యాచ్‌ అనంతరం పంత్‌ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ”ఇది నా డ్రీమ్‌ సిరీస్‌. ఈ క్రెడిట్‌ అంతా జట్టు మేనేజ్‌మెంట్‌ కే  చెందుతుంది. నేను జట్టును గెలిపిస్తానని పదేపదే నన్ను ఎప్పుడూ  ప్రోత్సహించేవారు. నాపై చాలా నమ్మకం ఉంచారు. జట్టును గెలిపించాలని ప్రతిరోజూ అనుకునేవాణ్ని. ఇవాళ అది సాధించాను” అని పంత్‌ చెప్పుకొచ్చాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

”టీమిండియాను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు” ఆసీస్ కోచ్ లాంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు..