AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేటి నుంచే భారత్‌లో అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్.. 15 దేశాలు.. 500 మందికి పైగా ప్లేయర్స్ పోటీ..

Grandmaster Chess Tournament: సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు జరిగే ఈ టోర్నీలో 15 దేశాలకు చెందిన 500 మందికి పైగా క్రీడాకారులు 100 మందికి పైగా అనుభవజ్ఞులైన మాస్టర్స్ సవాల్ చేయనున్నారు.

నేటి నుంచే భారత్‌లో అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్.. 15 దేశాలు.. 500 మందికి పైగా ప్లేయర్స్ పోటీ..
Grandmaster Chess Tournament
Venkata Chari
|

Updated on: Sep 19, 2022 | 8:44 AM

Share

International Grandmaster Chess Tournament: ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌కే కాకుండా యావత్ భారతదేశానికి చాలా ప్రత్యేకమైన రోజు. 19 సెప్టెంబర్ 2022 నుంచి అంటే ఈరోజు చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ప్రారంభమయ్యే అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో భారతదేశం, రష్యాతో సహా 15 దేశాల నుంచి 500 కంటే ఎక్కువ మంది ఆటగాళ్ళు పాల్గొంటారు.

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ క్రీడలు, యువజన సంక్షేమ శాఖ, ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్, ఛత్తీస్‌గఢ్ ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శనివారం తెలిపారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులకు ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి ట్రోఫీతో పాటు నగదు బహుమతిని అందజేయనున్నారు.

తొలిసారిగా ఈ స్థాయి పోటీలు ఇక్కడ నిర్వహించడం మాకు ప్రత్యేక సందర్భమని చెప్పారు. సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరిగే ఈ టోర్నమెంట్‌లో 15 దేశాల నుంచి 500 మందికి పైగా క్రీడాకారులు 100 మందికి పైగా అనుభవజ్ఞులైన మాస్టర్స్ మార్గదర్శకత్వంలో తమ ఛాలెంజ్‌ను ప్రదర్శిస్తారని నిర్వాహకులు తెలియజేశారు. ఇప్పటివరకు, రష్యా, ఉక్రెయిన్, జార్జియా, USA, కజకిస్తాన్, మంగోలియా, పోలాండ్, వియత్నాం, కొలంబియా, ఇరాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వే, నేపాల్ సహా 15 దేశాల నుండి పాల్గొనే క్రీడాకారులు ఇక్కడ నమోదు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

విజేతల ప్రైజ్ మనీ ఎలా ఉంది..

ఈ టోర్నీలో క్రీడాకారులు తమ రేటింగ్స్‌ను మెరుగుపరుచుకునేందుకు, జీఎం, ఐఎం నిబంధనలను సాధించేందుకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పారు. మాస్టర్స్, ఛాలెంజర్స్ అనే రెండు విభాగాల్లో ఈ టోర్నీ జరగనుంది. ఇందులో మాస్టర్స్ విభాగంలో రూ.23 లక్షలు, ట్రోఫీ, ఛాలెంజర్స్ విభాగంలో రూ.12 లక్షలు, విజేతలకు ట్రోఫీ అందజేయనున్నారు. ఈ టోర్నమెంట్‌లో ఆరుగురు గ్రాండ్‌మాస్టర్లు, 17 మంది ఇంటర్నేషనల్ మాస్టర్లు, ఇద్దరు మహిళా గ్రాండ్‌మాస్టర్లు, ఎనిమిది మంది మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్లు, ఐదుగురు ఫిడే మాస్టర్లు, 200 మంది ఐఎల్‌ఓ రేటింగ్ పొందిన క్రీడాకారులు పాల్గొనబోతున్నారని ఆర్గనైజింగ్ కమిటీకి సంబంధించిన అధికారులు తెలిపారు.