Orleans Masters: సెమీస్​లోకి దూసుకెళ్లిన భారత స్టార్​ షట్లర్​ సైనా నెహ్వాల్​…

|

Mar 27, 2021 | 1:36 AM

పారిస్​ వేదికగా జరుగుతున్న ఓర్లీన్స్​ మాస్టర్స్​లో భారత స్టార్​ షట్లర్​ సైనా నెహ్వాల్​ హవా కొనసాగిస్తోంది. మహిళల సింగిల్స్​లో అమెరికా ప్లేయర్​ ఐరిస్​ వాంగ్​తో జరిగిన క్వార్టర్​ ఫైనల్స్​లో...

Orleans Masters: సెమీస్​లోకి దూసుకెళ్లిన భారత స్టార్​ షట్లర్​ సైనా నెహ్వాల్​...
Follow us on

పారిస్​ వేదికగా జరుగుతున్న ఓర్లీన్స్​ మాస్టర్స్​లో భారత స్టార్​ షట్లర్​ సైనా నెహ్వాల్​ హవా కొనసాగిస్తోంది. మహిళల సింగిల్స్​లో అమెరికా ప్లేయర్​ ఐరిస్​ వాంగ్​తో జరిగిన క్వార్టర్​ ఫైనల్స్​లో 21-19, 17-21, 21-19తో గెలిచింది. గత రెండేళ్లుగా ఫామ్​లేమితో తంటాలు పడుతున్న సైనా.. సెమీస్ చేరడం ఇదే తొలిసారి.

ప్రపంచ 8న సీడ్​, భారత మహిళల డబుల్స్​ జోడీ అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి.. ఇంగ్లాండ్​కు చెందిన చోలే బిర్చ్-లారెన్ స్మిత్ జంటపై విజయం సాధించింది. 21-14, 21-18 తేడాతో గెలుపొందింది . తదుపరి మ్యాచ్​లో థాయ్​లాండ్​ జోడీ జోంగ్‌కోల్ఫాన్ కితితారకుల్-రవిందా ప్రజోంగ్​ను ఎదుర్కోనుంది.

పురుషుల డబుల్స్​ జోడీ క్రిష్ణ ప్రసాద్​-విష్ణు వర్ధన్.. ఫ్రాన్స్​ జంట క్రిస్టో పోపోవ్​-తోమ జూనియర్ పోపోవ్​ జంటపై విజయం సాధించింది. 21-17, 10-21, 22-20 తేడాతో గెలుపొందిన ఈ ద్వయం సెమీస్​కు అర్హత సాధించింది. తర్వాతి మ్యాచ్​లో ఇంగ్లాండ్​కు చెందిన కల్లమ్​ హమ్మింగ్-స్టీవెన్​ స్టాల్​వుడ్​ జంటతో ఆడనుంది.