ఖేలో ఇండియా యూత్ గేమ్స్ షూరు.. 10 రోజులు, 25 క్రీడలు, 8500 క్రీడాకారులు.. ప్రారంభించిన హోంమంత్రి..

దేశవ్యాప్తంగా సుమారు 8,500 మంది క్రీడాకారులు, కోచ్‌లు, సహాయక సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక్కడ ఆటగాళ్లు 1,866 పతకాల కోసం ఫీల్డ్‌లో తమ సత్తాను చాటుతారు. వీటిలో 545 స్వర్ణాలు, 545 రజతాలు, 776 కాంస్య పతకాలు ఉన్నాయి.

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ షూరు.. 10 రోజులు, 25 క్రీడలు, 8500 క్రీడాకారులు.. ప్రారంభించిన హోంమంత్రి..
Khelo India Youth Games 2022

Updated on: Jun 05, 2022 | 6:49 AM

Khelo India Youth Games 2022: శనివారం రాత్రి పంచకుల సెక్టార్-3లోని తౌ దేవి లాల్ స్పోర్ట్స్ స్టేడియంలో ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2021’ని హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సమయంలో, అమిత్ షాతో పాటు హర్యానా ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు వేదికపై ఉన్నారు. వందలాది మంది ప్రేక్షకుల మధ్య రంగురంగుల లైట్లలో ఆటలు ప్రారంభమయ్యాయి. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, హర్యానా క్రీడల మంత్రి సందీప్ సింగ్, ఆరోగ్య, హోం మంత్రి హర్యానా అనిల్ విజ్, హర్యానా విధానసభ స్పీకర్ గ్యాంచంద్ గుప్తా ఇతర నేతలు అమిత్ షా వెంట ఉన్నారు.

ఖేల్ ఉత్సవ్..

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జూన్ 4 నుంచి 13 వరకు జరుగుతాయి. దీని గురించి క్రీడాకారులు, క్రీడా ప్రేమికులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అదే సమయంలో, వేదిక వద్ద క్రీడాకారులు, ప్రేక్షకుల కోసం ప్రతిరోజూ పలు వినోద కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

4వ ఎడిషన్ ‘ ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2021’ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI), కేంద్ర యువజన వ్యవహారాలతోపాటు క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీని కింద క్రీడల నిర్వహణకు రూ.250 కోట్లు వెచ్చించనున్నారు. ఈ మొత్తంలో రూ.139 కోట్లను కొత్త క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, పాత మౌలిక సదుపాయాల మెరుగుదలకు వెచ్చించనున్నారు.

సాంప్రదాయ ఆటలు కూడా..

ఖేలో ఇండియా గేమ్స్‌లో, 5 సాంప్రదాయ క్రీడలు మొదటిసారిగా చేర్చారు. వీటిలో గట్కా, కలరిపయట్టు, తంగ్-టా, మల్కాంబ్, యోగా ఉన్నాయి. వాటిలో గట్కా, కలరిపయట్టు, తంగ్-టా సంప్రదాయ యుద్ధ కళలు కాగా, మలాఖంబ్, యోగా ఫిట్‌నెస్‌తో ముడిపడి ఉన్నాయి.

స్టేడియంలో 7 వేల మంది ప్రేక్షకులు కూర్చునే ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 8,500 మంది క్రీడాకారులు, కోచ్‌లు, సహాయక సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక్కడ ఆటగాళ్లు 1,866 పతకాల కోసం ఫీల్డ్‌లో తమ సత్తాను చాటుతారు. వీటిలో 545 స్వర్ణాలు, 545 రజతాలు, 776 కాంస్య పతకాలు ఉన్నాయి.

పంచకుల, అంబాలా, షహాబాద్, చండీగఢ్, ఢిల్లీలోని 5 నగరాల్లో 25 ఆటలు నిర్వహించనున్నారు. పంచకులలోని సెక్టార్-3లోని తౌ దేవి లాల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 7 వేల మంది ప్రేక్షకులు కూర్చునేందుకు సీటింగ్ ఏర్పాటు చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us