India vs England: మూడో టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధమైన సర్ధార్ పటేల్ స్టేడియం.. ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా పిచ్..!

|

Feb 20, 2021 | 3:31 PM

India vs England: ఫిబ్రవరి 24వ తేదీన భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న మూడో టెస్ట్ మ్యాచ్ కోసం సర్వం సిద్ధమైంది. నాలుగు టస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే రెండు..

India vs England: మూడో టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధమైన సర్ధార్ పటేల్ స్టేడియం.. ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా పిచ్..!
Follow us on

India vs England: ఫిబ్రవరి 24వ తేదీన భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న మూడో టెస్ట్ మ్యాచ్ కోసం సర్వం సిద్ధమైంది. నాలుగు టస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్‌లు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచ్‌లు కూడా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగగా.. మూడో టెస్ట్ మ్యాచ్‌ను గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో గల సర్ధార్ పటేల్ స్టేడియంలో నిర్వహిచంనున్నారు. ఈ డే అండ్ నైట్ మ్యాచ్‌ కోసం నిర్వాహకులు గ్రీన్‌ పిచ్‌ను సిద్ధం చేశారు. ఆకాశం నుంచి ఈ పిచ్ పచ్చదనంతో కళకళలాడుతోంది. కాగా, ఈ గ్రీన్ పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ అంశంలోనే ఇంగ్లండ్ జట్టు కాస్త ఊపిరి పీల్చుకుంది. ఇప్పటి వరకు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన రెండు మ్యాచ్‌ల్లో భారత్-ఇంగ్లండ్ చెరో మ్యాచ్ గెలిసి సిరీస్‌లో సమంగా నిలిచాయి. అయితే సర్ధార్ పటేల్ స్టేడియం పేసర్లకు అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో ఇంగ్లండ్ టీమ్ కాస్త సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మూడో టెస్ట్‌లో తమ బౌలింగ్‌తో విజృంభించి భారత్‌ను మట్టికరిపించాలని భావిస్తోంది. అయితే మరో విశ్లేషణ ఏంటంటే.. ప్రస్తుతం సర్ధార్ పటేట్ స్టేడియం పిచ్ పచ్చగా కనువిందు చేస్తున్నప్పటికీ.. మ్యాచ్ జరగానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. ఈ నాలుగు రోజుల్లో వాతావరణ ప్రభావం పిచ్‌పై పడే అవకాశం ఉందని, ఫలితంగా పిచ్‌పై పగళ్లు వస్తే స్పిన్‌కు అనుకూలంగా మార్చే ఛాన్స్ లేకపోలేదని అంచనా వేస్తున్నారు. అదే గనుక జరిగితే మూడవ మ్యాచ్‌లోనూ టీమిండియాకు తిరుగులేనట్లేనని చెప్పాలి.

Also read:

దబిడి దిబిడైన సర్కారు లెక్క, అంచనాలకు సిండికేట్ అడ్డం, హైదరాబాద్‌లో లాటరీ ద్వారా 55 కొత్త బార్‌లు కేటాయింపు

యూఎస్ లో గ్రీన్ కార్డులు కోరేవారికి శుభవార్త ! త్వరలో రానున్న కొత్త చట్టం, బైడెన్ సంతకమే తరువాయి