India Vs Australia 2020: ప్రారంభమైన భారత్-ఆస్ట్రేలియా తొలి టెస్ట్.. టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ..

|

Dec 17, 2020 | 9:40 AM

నాలుగు టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నేడు జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. అడిలైడ్ క్రికెట్ మైదానం వేదికగా..

India Vs Australia 2020: ప్రారంభమైన భారత్-ఆస్ట్రేలియా తొలి టెస్ట్.. టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ..
Follow us on

India Vs Australia 2020: నాలుగు టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నేడు జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. అడిలైడ్ క్రికెట్ మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచింది. టాస్ గెలిచిన కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. వరుస విజయవాలతో మంచి ఉత్సాహంతో ఉన్న టీమిండియా జట్టు ఈ సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఆసిస్ జట్టు కూడా టీమిండియాను మట్టికరిపించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఆ మేరకు కంగారూలు సంసిద్ధమయ్యారు.

ఇరు జట్ల ప్లేయర్లు..

భారత జట్టు: పృధ్వి షా, మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, విహారి, వృద్దిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా జట్టు: జో బర్న్స్, మాథ్యూ వాడె, ముర్నస్ లబ్‌షేన్, స్మిత్, ట్రావిస్ హెడ్, కెమరాన్ గ్రీన్, టిమ్ పైన్, కుమిన్స్, మిచెల్ స్టార్క్, నథన్ లయన్, హాజెల్‌వుడ్.

 

Also read:

Breaking : అర్ధరాత్రి చొరబాటు యత్నం.. ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టిన భారత సైన్యం..

డేంజర్ సెల్ఫీస్..! రైలుపైకెక్కి సెల్ఫీ తీసుకుంటూ నిట్టనిలువునా దహనమై బుగ్గిగామారిన ఇంటర్ విద్యార్థి