AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిక్సింగ్ ఆరోపణలు.. ఇద్దరు యూఏఈ క్రికెటర్లపై ఐసీసీ నిషేధం

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు యూఏఈ క్రికెటర్లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చర్యలు తీసుకుంది

ఫిక్సింగ్ ఆరోపణలు.. ఇద్దరు యూఏఈ క్రికెటర్లపై ఐసీసీ నిషేధం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 14, 2020 | 1:25 PM

Share

UAE Cricketers ICC: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు యూఏఈ క్రికెటర్లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చర్యలు తీసుకుంది. ఆమిర్ హయత్, అష్ఫఖ్‌ అహ్మద్‌లపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. వీరిద్దరిపై ఐదు వేర్వేరు ఆరోపణలు నమోదు కాగా.. 14 రోజుల్లో ఆ ఆరోపణలకు సమాధానం ఇవ్వాలంటూ ఐసీసీ వెల్లడించింది. వారిద్దరిపై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయో ఐసీసీ స్పష్టత ఇవ్వలేదు. కాగా అష్ఫఖ్‌ 16 వన్డేలు, 12 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అలాగే హయత్‌ 8 వన్డేలు 4 టీ20లు ఆడారు.

Read More:

శ్రావణి కేసు: పరారీలో ఆర్‌ఎక్స్ 100 నిర్మాత

‘కౌన్ బనేగా’ గెలిచాక ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా.. నా భార్యతో విడాకుల వరకు వెళ్లా