‘కౌన్ బనేగా’ గెలిచాక ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా.. నా భార్యతో విడాకుల వరకు వెళ్లా

భారతీయ బుల్లితెర వీక్షకులకు కౌన్ బనేగా క్రోర్‌పతి ప్రోగ్రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

'కౌన్ బనేగా' గెలిచాక ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా.. నా భార్యతో విడాకుల వరకు వెళ్లా
Follow us

| Edited By:

Updated on: Sep 14, 2020 | 1:02 PM

Kaun Banega Sushil Kumar: భారతీయ బుల్లితెర వీక్షకులకు కౌన్ బనేగా క్రోర్‌పతి ప్రోగ్రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోలో పాల్గొన్న కొంతమంది లక్షాధికారులు అవ్వగా.. మరికొందరు కోటీశ్వరులు కూడా అయ్యారు. వారిలో బీహార్‌కి చెందిన సుశీల్ కుమార్ ఒకరు. ఐదో సీజన్‌లో పాల్గొన్న సుశీల్‌.. 5కోట్లను గెలుచుకున్నారు. అయితే అంత డబ్బులు సాధించినా.. అతడి జీవితం సాఫీగా సాగలేదట. నిజానికి చెప్పాలంటే అదొక చెత్త సమయమని, చాలా సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చిందని అతడు తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో సుశీల్‌ ఓ పోస్ట్ చేశారు.

”2015 నుంచి 2016 వరకు నా జీవితంలో చాలా క్లిష్టమైన సమయం. కౌన్ బనేగాలో నేను గెలిచిన తరువాత బీహార్‌లోని పలు ప్రోగ్రామ్‌లకు నన్ను ఆహ్వానించారు. ఇలా నెలలో 15 రోజులు నేను వాటికి హాజరయ్యేందుకు సరిపోయింది. ఆ సమయంలో నా చదువు కూడా గాడి తప్పింది. నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఇంటర్వ్యూలు చేశారు. ఆ సమయంలో వారికి చెప్పాలని పలు బిజినెస్‌ల్లో పెట్టుబడులు పెట్టా. అందులో నష్టాలే ఎక్కువగా వచ్చాయి. ఆ తరువాత నలుగురికి సాయం చేయాలన్న ఆలోచనతో ప్రతి నెల రూ.50వేలు దానం చేసేవాడిని. ఎవరి మీద నమ్మకం కలగలేదు. నా వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నా. నా భార్యతో విడాకుల వరకు వెళ్లా.

అదే సమయంలో కొన్ని మంచి సంఘటనలు కూడా జరిగాయి. ఢిల్లీలో కొన్ని స్టూడెంట్‌ గ్రూప్‌లను కలిశా. కొత్త విషయాలు తెలుసుకున్నా. ఆ సమయంలో సిగరెట్‌, ఆల్కాహాల్‌కి బాగా అలవాటు పడ్డా. సినిమాలంటే పిచ్చితో చాలా సమయం వాటిని చూసేందుకు కేటాయించేవాడిని. అంతేకాదు అప్పుడు సినిమాలపై ఆసక్తి పెరగడంతో ముంబయికి వెళ్లా. కొన్ని అడ్వర్టైజ్‌మెంట్‌లు చేశా. ఓ సినిమాకు స్క్రిప్ట్‌ని రాశా. దానికి 20వేలు వచ్చింది. అయితే ఇదంతా సాగుతున్నప్పుడే జీవితం అంటే ఏంటో తెలిసింది. మన మనసుకు నచ్చినట్లు ఉండటం నిజమైన సంతోషమనిపించింది. ప్రాచుర్యం పొందడం కంటే ఒక మంచి మనిషిగా జీవించడం వంద రెట్లు మంచిదని అనిపించింది. అందుకే వెనక్కి వచ్చి నాకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నా” అని తెలిపారు. కాగా ప్రస్తుతం తన సొంత ఊరిలో సుశీల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. 2016లో మద్యం తాగడాన్ని మానుకున్నానని, గతేడాది నుంచి ధూమపానం కూడా మానేశానని ఈ విజేత చెప్పుకొచ్చారు.

Read More:

సుశాంత్ కేసు.. మరో ఆరుగురిని అరెస్ట్‌ చేసిన ఎన్సీబీ

‘యాత్ర’ దర్శకుడితో నాగార్జున మూవీ..!

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు