IND vs ENG: ఇంగ్లండ్ ఎఫెక్ట్.. కట్‌చేస్తే.. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఇషాన్ ఔట్.. టెస్ట్ సిరీస్‌కు ముందు ఇంత జరిగిందా?

Ishan Kishan, India vs England Test Series: అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా దేశవాళీ క్రికెట్ ఆడాలనే బీసీసీఐ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఇషాన్ కిషన్ తన వార్షిక కాంట్రాక్ట్ నుంచి విడుదలయ్యాడు. ఇప్పుడు కిషన్ గురించి కొత్త వార్త బయటకు వచ్చింది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ సందర్భంగా BCCI ఇషాన్ కిషన్‌ను సంప్రదించిందని తెలుస్తోంది.

IND vs ENG: ఇంగ్లండ్ ఎఫెక్ట్.. కట్‌చేస్తే.. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఇషాన్ ఔట్.. టెస్ట్ సిరీస్‌కు ముందు ఇంత జరిగిందా?
Ishan Kishan

Updated on: Mar 02, 2024 | 12:37 PM

Ishan Kishan, India vs England Test Series: భారత యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్‌(Ishan Kishan) ను బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించడంతో అతని భవిష్యత్తు ప్రమాదంలో పడింది. కిషన్ మానసిక అలసట కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిగాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. జాతీయ జట్టుకు ఆడేందుకు అనుమతించకపోతే దేశవాళీ క్రికెట్‌లో తమ రాష్ట్ర జట్లకు ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లను అనుమతించాలని బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇషాన్ దీనిని పట్టించుకోలేదు. పాండ్యా సోదరులతో కలిసి IPL 2024 కోసం సిద్ధం చేయడానికి బరోడాకు బయలుదేరాడు.

కిషన్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ అతడిని వార్షిక ఒప్పందం నుంచి తప్పించింది. బరోడాతో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో ముంబై తరపున ఆడనందుకు ఇషాన్ కిషన్ మాత్రమే కాకుండా శ్రేయాస్ అయ్యర్ కూడా BCCI నుంచి తీవ్రమైన చర్యను ఎదుర్కొన్నాడు. ఇద్దరూ వారి కాంట్రాక్ట్‌ల నుంచి తొలగించబడ్డారు.

స్టార్ ఆటగాళ్లను తొలగించడానికి బీసీసీఐ స్పష్టమైన కారణాన్ని వెల్లడించలేదు. కానీ, ఆటగాళ్లను కాంట్రాక్ట్‌కు పరిగణించలేదని ధృవీకరించింది. ఇప్పుడు, ESPNCricnfo లో ఒక నివేదిక ప్రకారం, BCCI ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ సందర్భంగా ఇషాన్ కిషన్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో ఆడాలని కిషన్‌ను బీసీసీఐ కోరింది. కానీ, వికెట్ కీపర్-బ్యాటర్ దీనికి కూడా నో చెప్పాడంట. టెస్టు క్రికెట్ ఆడేందుకు ఇంకా సిద్ధంగా లేనంటూ చెప్పినట్లు తెలుస్తోంది. కిషన్ నిరాకరించిన తర్వాత, బోర్డు కేఎస్ భరత్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేసింది.

మార్చి 7 నుంచి భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. రాహుల్ ఇంకా ఫిట్‌నెస్‌ను తిరిగి పొందకపోవడంతో ఆటకు దూరంగా ఉన్నాడు. క్వాడ్రిస్ప్స్ స్నాయువు గాయంపై నిపుణుల అభిప్రాయాన్ని తీసుకోవడానికి రాహుల్ లండన్ వెళ్లాడు. అలాగే, నాలుగో టెస్టు నుంచి విశ్రాంతి తీసుకున్న పేసర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఐదో టెస్టుకు తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రానున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..