Viral : కోహ్లీ కాళ్లు మొక్కిన లక్నో కుర్రాడు.. కింగ్ రియాక్షన్ వైరల్.. చిన్నస్వామి స్టేడియంలో ఎమోషనల్ సీన్

Viral : లక్నో యువ ఆటగాడు నమన్ తివారీ విరాట్ కోహ్లీ పాదాలను తాకబోగా, కోహ్లీ స్పందించిన తీరు వైరల్ అవుతోంది.క్రికెట్ ప్రపంచంలో కోహ్లీకి ఉన్న క్రేజ్ , యువ ఆటగాళ్లలో అతడిపై ఉన్న గౌరవం ఈ ఘటనతో మరోసారి స్పష్టమైంది.

Viral : కోహ్లీ కాళ్లు మొక్కిన లక్నో కుర్రాడు.. కింగ్ రియాక్షన్ వైరల్.. చిన్నస్వామి స్టేడియంలో ఎమోషనల్ సీన్
Virat Kohli

Updated on: Apr 16, 2026 | 4:22 PM

Viral : ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరిగిన మ్యాచ్ అనంతర దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న విరాట్ కోహ్లీ వద్దకు లక్నో యువ ఆటగాడు నమన్ తివారీ వెళ్లగా, అక్కడ ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కోహ్లీని చూడగానే వినయంతో పాద నమస్కారం చేసేందుకు నమన్ ప్రయత్నించగా, కోహ్లీ స్పందించిన తీరు నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. క్రికెట్ ప్రపంచంలో కోహ్లీకి ఉన్న క్రేజ్, యువ ఆటగాళ్లలో అతడిపై ఉన్న గౌరవం ఈ ఘటనతో మరోసారి స్పష్టమైంది.

ఏం జరిగింది? ఆ వైరల్ వీడియోలో ఏముంది?

బుధవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్ల ఆటగాళ్లు పరస్పరం పలకరించుకుంటున్న సమయంలో, లక్నో యువ బౌలర్ నమన్ తివారీ, ముకుల్ చౌదరి విరాట్ కోహ్లీతో మాట్లాడుతున్నారు. ఆ సంభాషణ మధ్యలో నమన్ తివారీ అకస్మాత్తుగా కోహ్లీ పాదాలను తాకేందుకు కిందకు వంగాడు. ఇది చూసి ఆశ్చర్యపోయిన కోహ్లీ, వెంటనే నమన్‌ను వారించి పైకి లేపి నవ్వుతూ అభినందించాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా షేర్ అవుతోంది.

కోటి రూపాయల కుర్రాడు నమన్

నమన్ తివారీ ఎవరో కాదు, ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్‌తో హోరాహోరీ పోరు సాగించి లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ.కోటి వెచ్చించి కొనుగోలు చేసిన యువ సంచలనం. అంత ధర పలికిన స్టార్ ప్లేయర్ అయినప్పటికీ, లెజెండరీ ఆటగాడైన విరాట్ కోహ్లీ పట్ల అతడు చూపిన గౌరవం అందరినీ ఆకట్టుకుంది. కోహ్లీ కూడా ఆ కుర్రాడి వినయానికి ముగ్ధుడై అతడితో కాసేపు ముచ్చటించి బౌలింగ్ చిట్కాలను పంచుకున్నట్లు తెలుస్తోంది.

అనారోగ్యంలోనూ కోహ్లీ పరుగుల వేట

విశేషమేమిటంటే, ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ పూర్తి ఫిట్‌నెస్‌తో లేడు. గత నాలుగు ఐదు రోజులుగా అనారోగ్యంతో ఉన్నాడని, తన మోకాలికి కూడా గాయం ఉందని మ్యాచ్ అనంతరం కోహ్లీ స్వయంగా వెల్లడించాడు. అయినప్పటికీ తన బాధ్యతను మరవకుండా 34 బంతుల్లో 49 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో మొత్తం 228 పరుగులు పూర్తి చేసి ఆరెంజ్ క్యాప్‎ను మళ్ళీ కైవసం చేసుకున్నాడు.

ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్

విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్, జట్టు సమిష్టి కృషితో ఆర్సీబీ ఇప్పుడు ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగబాకింది. 146 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 15.1 ఓవర్లలోనే పూర్తి చేసింది. విరాట్ కోహ్లీ తన ఇంటెన్సిటీ గురించి మాట్లాడుతూ.. “గత మ్యాచ్ కంటే ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉన్నాను, కానీ ఇంకా 100 శాతం ఫిట్‌నెస్ సాధించలేదు. అయినప్పటికీ జట్టు కోసం పోరాడటం సంతృప్తినిచ్చింది” అని పేర్కొన్నాడు. కోహ్లీ ఆటతీరుతో పాటు మైదానం బయట అతడు ఇచ్చే గౌరవం కూడా అతడిని గొప్ప వ్యక్తిగా నిలబెడుతోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us