AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2022: ‘టీ20 ప్రపంచకప్ నుంచి త్రిమూర్తులను తప్పించండి.. 2007లాంటి డెషిషన్ కావాల్సిందే’

2007లో బీసీసీఐ టీ20 ప్రపంచ కప్‌నకు MS ధోని నాయకత్వంలో కొత్త, యువ జట్టును పంపింది. అక్కడ పాకిస్తాన్‌ను ఓడించి భారత్ మొదటి T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

T20 World Cup 2022: 'టీ20 ప్రపంచకప్ నుంచి త్రిమూర్తులను తప్పించండి.. 2007లాంటి డెషిషన్ కావాల్సిందే'
Rohit, Kl Rahul, Virat Kohli
Venkata Chari
|

Updated on: Sep 11, 2022 | 4:45 PM

Share

ఆసియా కప్ 2022లో భారత్ ప్రయాణం సూపర్ 4లోనే ముగిసింది. సూపర్ 4లో భారత్ అఫ్గానిస్థాన్‌పై మాత్రమే విజయం సాధించింది. అయితే ఇంతకు ముందు పాకిస్థాన్, శ్రీలంక చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ సమయంలో భారత జట్టులో అనేక ప్రయోగాలు జరిగాయి. అవి ఫ్లాప్‌గా మారాయి. ఇప్పుడు టీమిండియా చూపు ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ 20 ప్రపంచకప్‌పై పడింది. దీనికోసం త్వరలో జట్టును ప్రకటించబోతున్నారు. ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశం ఎవరికి వస్తుందోనని భారత అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

యువకుల టీమ్‌ని ప్రపంచకప్ పంపనున్న బీసీసీఐ.. ఆసియా కప్‌లో జట్టు ప్రదర్శనను చూసిన తర్వాత, కొంతమంది అభిమానులు BCCI 2007 మార్గాన్ని అనుసరించాలని, T20 ప్రపంచ కప్ నుంచి KL రాహుల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను పక్కనపెట్టాలని, యువ జట్టును పంపాలని కోరుకుంటున్నారు. 2007 T20 ప్రపంచ కప్‌లో చేసినట్లుగా చేయాలి. ఆకాష్ చోప్రా అభిమానులతో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్నాడు. అభిమానులు భారత క్రికెట్ గురించి ప్రశ్నలు అడిగారు. దానికి అతను తన యూట్యూబ్ ఛానెల్‌లో సమాధానమిచ్చాడు. అదే సెషన్‌లో ఆకాష్ చోప్రాను ఒక యూజర్ ఓ ప్రశ్న అడిగాడు. టాప్ 3 రాహుల్, కోహ్లీ, రోహిత్‌లను ప్రపంచ కప్ నుంచి తప్పించి యువ జట్టును ఎంపిక చేయడం సాధ్యమేనా అంటూ ప్రశ్నలు సంధించాడు.

ఇవి కూడా చదవండి

ప్రపంచకప్‌లో భారత్‌ అత్యుత్తమ గ్రూప్‌ అనే ప్రశ్నకు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. దీనితో తాను ఏకీభవించనని తెలిపాడు. ప్రపంచకప్‌లో ముగ్గురు ఆటగాళ్లు ఆడాలి. మంచి వేదికను ఉండాలి. ప్రపంచకప్‌లో మనకు మంచి గ్రూప్‌ ఉంది. ఆదిలోనే బిగ్ మ్యాచ్. అందుకే ఈ ముగ్గురూ ఆడాలి. వాస్తవానికి, 2007లో, BCCI T20 ప్రపంచ కప్‌ 2022కు MS ధోని నాయకత్వంలో కొత్త, యువ జట్టును పంపింది. అక్కడ భారతదేశం పాకిస్తాన్‌ను ఓడించి మొదటి T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ల గురించి మాట్లాడుతూ, ఆసియా కప్‌లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఖచ్చితంగా పేలవమైన ఫామ్‌తో పోరాడుతున్నారు. అయితే విరాట్ కోహ్లీ ఆసియా కప్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఆసియా కప్‌లో 2 అర్ధసెంచరీలు, సెంచరీ సాధించాడు.