AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: పాకిస్తాన్‌పై రికార్డులు వెల్లువ.. సచిన్, రోహిత్‌లను వెనక్కునెట్టిన మాస్టర్ ఆఫ్ రన్ ఛేజర్..

విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రికార్డుల పర్వం నెలకొంది. ఈ క్రమంలో విరాట్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మలను వెనక్కునెట్టాడు.

IND vs PAK: పాకిస్తాన్‌పై రికార్డులు వెల్లువ.. సచిన్, రోహిత్‌లను వెనక్కునెట్టిన మాస్టర్ ఆఫ్ రన్ ఛేజర్..
Virat Kohli Sachin Rohit
Venkata Chari
|

Updated on: Oct 24, 2022 | 4:49 PM

Share

ఆదివారం (అక్టోబర్ 23) మెల్‌బోర్న్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రికార్డుల పర్వం నెలకొంది. ఈ క్రమంలో విరాట్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మలను వెనక్కునెట్టాడు. అతను 53 బంతుల్లో అజేయంగా 82 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. కోహ్లీ స్ట్రైక్ రేట్ 154.72గా ఉంది.

టెండూల్కర్‌ను అధిగమించిన కోహ్లీ..

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి డిఫరెంట్ కలర్‌లో కనిపిస్తున్నాడు. దాదాపు ప్రతి సందర్భంలోనూ పాకిస్థాన్‌పై పైచేయి సాధించాడు. ఐసీసీ ఈవెంట్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపిక కావడం ఇది నాలుగోసారి. ఈ విషయంలో టెండూల్కర్‌ను అధిగమించాడు. ఐసీసీ ఈవెంట్లలో సచిన్ మూడుసార్లు పాకిస్థాన్‌తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

రోహిత్‌ను పక్కనపెట్టిన కోహ్లీ..

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ విషయంలో రోహిత్‌ను వెనక్కునెట్టాడు. 110 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 102 ఇన్నింగ్స్‌ల్లో 3794 పరుగులు చేశాడు. కోహ్లీ సగటు 51.97గా నిలిచింది. కోహ్లి పేరిట 34 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో రోహిత్ గురించి మాట్లాడితే, అతని పేరు మీద 3741 పరుగులు ఉన్నాయి. అతని తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్టిల్ (3531), పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (3231), ఐర్లాండ్‌కు చెందిన పాల్ స్టిర్లింగ్ (3119) ఉన్నారు.

ఇవి కూడా చదవండి

18వ సారి ఛేజింగ్‌లో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ..

టీ20 క్రికెట్‌లో కోహ్లి భారత్ తరఫున 18వ సారి నాటౌట్‌గా నిలిచాడు. ఈ 18 పర్యాయాలు టీమ్ ఇండియా ఒక్కసారి కూడా ఓడిపోకపోవడమే మాస్టర్ ఆఫ్ రన్ ఛేజ్ అని పిలుచుకునే ఘనత కోహ్లీకి దక్కింది.

హార్దిక్, భువనేశ్వర్.. ఉమర్ గుల్‌తో సమానంగా..

టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్‌లు పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఉమర్ గుల్‌ను సమం చేశారు. భారత్‌పై ఈ టోర్నీలో గుల్ మొత్తం 11 వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్‌పై భువనేశ్వర్, హార్దిక్ తలో 11 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ మూడు వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో భువనేశ్వర్ తన పేరిట ఒక వికెట్ తీసుకున్నాడు. చివరి బంతికి భారత్‌ నాలుగోసారి విజయం సాధించింది

చివరి బంతికి విజయం..

టీ20లో చివరి బంతికి భారత జట్టు విజయం సాధించడం ఇది నాలుగోసారి. మొదటిసారి 2016లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగింది. ఆ తర్వాత 2018లో బంగ్లాదేశ్‌పై కొలంబోలో, 2018లో వెస్టిండీస్‌పై చెన్నైలో, 2022లో పాకిస్థాన్‌పై మెల్‌బోర్న్‌లో విజయాలు సాధించింది.

ఆ స్పెషల్ రికార్డులో ఆస్ట్రేలియాతో సమానంగా..

టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో చివరి మూడు ఓవర్లలో 48 పరుగులు చేసి మ్యాచ్ గెలిచిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. పాకిస్థాన్‌పై టీమిండియా 18 బంతుల్లో 48 పరుగులు చేయాల్సి వచ్చింది. విరాట్ కోహ్లి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. అంతకుముందు, 2010లో గ్రాస్ ఐలెట్ (వెస్టిండీస్)లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా చివరి మూడు ఓవర్లలో 48 పరుగులు చేసింది. 2014లో మిర్పూర్ (బంగ్లాదేశ్)లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ 42 పరుగులు, 2010లో గ్రాస్ ఐలెట్‌లో భారత్‌పై శ్రీలంక 41 పరుగులు చేసింది.

Follow Us