Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: జట్టు మొత్తం సంబురాలు చేసుకుంటుంది.. అతడు మాత్రం ప్రశాంతంగా కూర్చున్నాడు..

న్యూజిలాండ్ బుధవారం ఇంగ్లాండ్‌పై థ్రిల్లింగ్ విజయంతో టీ20 ప్రపంచ కప్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఈ మ్యాచ్‎ గెలిచిన తర్వాత కివీస్ ఆటగాళ్లు సంబురాలు చేసుకోగా జిమ్మీ నీషమ్ ప్రశాంతంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‎లో నీషమ్ కీలకంగా వ్యవహరించాడు...

T20 World Cup 2021: జట్టు మొత్తం సంబురాలు చేసుకుంటుంది.. అతడు మాత్రం ప్రశాంతంగా కూర్చున్నాడు..
Neesham
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 11, 2021 | 6:21 PM

న్యూజిలాండ్ బుధవారం ఇంగ్లాండ్‌పై థ్రిల్లింగ్ విజయంతో టీ20 ప్రపంచ కప్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఈ మ్యాచ్‎ గెలిచిన తర్వాత కివీస్ ఆటగాళ్లు సంబురాలు చేసుకోగా జిమ్మీ నీషమ్ ప్రశాంతంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‎లో నీషమ్ కీలకంగా వ్యవహరించాడు. దీంతో న్యూజిలాండ్ 2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు ప్రతీకారం తీర్చుకుంది. ఛేదన కోసం బరిలోకి దిగిన న్యూజిలాండ్ ప్రారంభంలోనే తమ స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గప్టిల్, కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఆట క్రమంగా ఇంగ్లాండ్ చేతిలోకి వెళ్లింది. అయితే డారిల్ మిచెల్ పట్టు వదలకుండా క్రీజ్‎లోనే పాతుకుపోయాడు. అతనికి అండగా జిమ్మీ నీషమ్ వచ్చి మ్యాచ్‎ను మలుపు తిప్పాడు. 11 బంతుల్లో 27 పరుగులు చేశాడు. దీంతో మిచెల్ కూడా దాటిగా ఆడడం మొదలు పెట్టాడు. మిచెల్ 47 బంతుల్లో 72 పరుగులు చేసి ఒక ఓవర్ మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు.

17వ ఓవర్‌లో ఇంగ్లండ్ పేసర్ క్రిస్ జోర్డాన్‌ను టార్కెట్ చేసుకున్న నీషమ్ కివీస్‌కు ఊపును అందించాడు. మిచెల్ తర్వాతి రెండు ఓవర్లలో స్పిన్నర్ ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్‌లను లక్ష్యంగా చేసుకుని పరుగులు రాబట్టాడు. 19వ ఓవర్ చివరి బంతికి మిచెల్ బౌండరీ బాది మ్యాచ్‎ను పూర్తి చేశాడు. దీంతో న్యూజిలాండ్ డగౌట్ టోర్నమెంట్‌లో తమ జట్టు ఫైనల్‌కి చేరినందుకు సంబరాలు చేసుకుంది. కానీ, కివీ యూనిట్‌లో ఒక వ్యక్తి కూర్చుని వేడుకలు చేసుకోవడానికి నిరాకరించాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు నీషమ్.

నీషమ్ తన ‘కూల్ గై’ చిత్రాన్ని చూపుతున్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆల్ రౌండర్ ట్విట్టర్‌లోకి వెళ్లి ఇలా వ్రాశాడు: “ఉద్యోగం పూర్తయిందా? నేను అలా అనుకోను.” మిచెల్ తన అద్భుతమైన హాఫ్ సెంచరీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు” అని అన్నాడు. మిచెల్ తన మెరుపుదాడితో ఆట యొక్క వేగాన్ని మార్చకపోతే రన్-ఛేజ్ సాధ్యం కాదని అతను మ్యాచ్ తర్వాత తెలిపాడు. “కాన్వే ప్లాట్‌ఫారమ్‌ను సెట్ చేసిన విధానం, నీషమ్ నేల నుంచి బంతిని కొట్టిన విధానం అద్భుతంగా ఉంది. ఒకటి లేదా రెండు మంచి ఓవర్లు వస్తాయని మాకు తెలుసు, నీషమ్ ఆటతో మేము తిరిగి ఊపందుకున్నాము, ”అని అతను చెప్పాడు.

Read Also.. T20 World Cup 2021: న్యూజిలాండ్‎పై మాజీ క్రికెటర్ల ప్రశంసలు.. అద్భుతంగా ఆడారని సచిన్ కితాబు..