
Vaibhav Sooryavanshi: ఐదుసార్లు ఛాంపియన్స్ గా నిలిచిన భారత్.. 1998 విజేత ఇంగ్లాండ్ మధ్య ఈరోజు అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత జట్టుకు తొలి ఎదురు దెబ్బ తగిలినా.. వైభవ్ సూర్యవంశీ, ఆయూష్ మాత్రేలు భారత జట్టును ఆదుకున్నారు. వార్త రాసే సమాయానికి భారత జట్టు 13.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. చేసింది. వైభవ్ సూర్యవంశీ (55), ఆయుష్ మాత్రే (34) కీలక భాగస్వామ్యంతో దూసుకెళ్తున్నారు. తొమ్మిది పరుగుల వద్ద ఆరోన్ అవుట్ అయ్యాడు.
ఆది నుంచి దూకుడుగా కనిపించిన వైభవ్ సూర్యవంశీ.. బౌండరీలతో డీల్ చేస్తున్నాడు. తొలుత ఆడితూచి ఆడిన వైభవ్ కేవలం 32 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ లతో హాఫ్ సెంచరీ బాదేశాడు. అయితే, అభిమానులు మాత్రం సెంచరీతో చెలరేగాలని కోరుకుంటున్నారు.
11వ ఓవర్లో భారత జట్టు 10 పరుగులు చేసింది. ఆ ఓవర్ లోని నాల్గవ బంతికి వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సిక్స్ కొట్టాడు. ఆ తర్వాతి బంతికే సింగిల్ కొట్టి తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రపంచ కప్ లో వైభవ్ కు ఇది నాల్గవ అర్ధ సెంచరీ. కేవలం 32 బంతుల్లోనే దీనిని పూర్తి చేశాడు.
ఇంగ్లాండ్ U19 (ప్లేయింగ్ XI): బెన్ డాకిన్స్, జోసెఫ్ మూర్స్, బెన్ మేయస్, థామస్ రెవ్ (కెప్టెన్, కీపర్), కాలేబ్ ఫాల్కనర్, రాల్ఫీ ఆల్బర్ట్, ఫర్హాన్ అహ్మద్, సెబాస్టియన్ మోర్గాన్, జేమ్స్ మింటో, మానీ లమ్స్డెన్, అలెక్స్ గ్రీన్.
ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే(కెప్టెన్), విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(కీపర్), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..