12 సిక్సర్లు, 7 ఫోర్లు.. 28 బంతుల్లో సెంచరీ.. టీ20లో విధ్వంసం సృష్టించిన భారత బ్యాటర్..

2024–25 సయ్యద్ ముష్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఆరు ఇన్నింగ్స్‌లలో 78.75 సగటు, సుమారు 229.92 స్ట్రైక్ రేట్‌తో 315 పరుగులు సాధించి వార్తల్లో నిలిచాడు. ఉర్విల్ పటేల్ 50 టీ20 మ్యాచ్‌లలో 1,230 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వికెట్ కీపింగ్‌లో, అతను 37 క్యాచ్‌లు తీసుకున్నాడు.

12 సిక్సర్లు, 7 ఫోర్లు.. 28 బంతుల్లో సెంచరీ.. టీ20లో విధ్వంసం సృష్టించిన భారత బ్యాటర్..
Urvil Patel

Updated on: Oct 06, 2025 | 1:55 PM

కేవలం 28 బంతుల్లోనే సెంచరీ సాధించి టీ20 క్రికెట్‌లో ఒక ఉత్కంఠభరితమైన భారత బ్యాట్స్‌మన్ సంచలనం సృష్టించాడు. భూకంపం వచ్చినట్లుగా ఈ భారత బ్యాట్స్‌మన్ క్రికెట్ మైదానంలో విధ్వంసం సృష్టించాడు. ఈ ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్ బ్యాటింగ్ తో ప్రత్యర్థి జట్టు బౌలర్లు చేతులు ఎత్తేశారు. ఈ భారత బ్యాట్స్‌మన్ తన చారిత్రాత్మక ఇన్నింగ్స్‌లో సిక్సర్ల వర్షం కురిపించి సత్తా చాటాడు.

28 బంతుల్లో సెంచరీ..

భారత 26 ఏళ్ల తుఫాన్ బ్యాట్స్‌మన్ ఉర్విల్ పటేల్ టీ20 క్రికెట్‌లో ఈ మైలురాయిని సాధించాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2024-25 సీజన్‌లో గుజరాత్ తరపున ఆడిన ఉర్విల్ పటేల్, నవంబర్ 27, 2024న త్రిపురతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 28 బంతుల్లో సెంచరీ సాధించాడు. మొత్తం టీ20 క్రికెట్‌లో ఇది ఒక భారతీయ బ్యాట్స్‌మన్ చేసిన వేగవంతమైన సెంచరీ ఇదే కావడం గనమార్హం. ఉర్విల్ పటేల్ 28 బంతుల్లో సెంచరీ సాధించి 35 బంతుల్లో 113 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

సిక్సర్ల వర్షం..

ఉర్విల్ పటేల్ 322.85 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ 12 సిక్సర్లు, 7 ఫోర్లు కొట్టాడు. ఈ రికార్డుతో, ఐపీఎల్‌లో 30 బంతుల్లో సెంచరీ చేసిన క్రిస్ గేల్ రికార్డును ఉర్విల్ పటేల్ అధిగమించాడు. ఇండోర్‌లో జరిగిన ఈ టీ20 మ్యాచ్‌లో, త్రిపుర ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 155/8 పరుగులు చేసింది. త్రిపుర గుజరాత్‌కు విజయానికి 156 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. దీనికి సమాధానంగా, గుజరాత్ 10.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 156 పరుగులు చేసి 58 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

హిస్టరీ రిపీట్ చేసిన అభిషేక్ శర్మ..

కొన్ని రోజుల తర్వాత, భారత బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ ఉర్విల్ పటేల్ ఘనతను పునరావృతం చేశాడు. ఉర్విల్ పటేల్ ఘనత తర్వాత, శర్మ డిసెంబర్ 5, 2024న సయ్యద్ ముష్తాక్ అలీ టీ20 ట్రోఫీ 2024 టోర్నమెంట్‌లో మేఘాలయపై 28 బంతుల్లో సెంచరీ సాధించాడు. మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో శర్మ 29 బంతుల్లో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఈ కాలంలో అతని స్ట్రైక్ రేట్ 365.51గా నిలిచింది.

టీ20 క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీగా ప్రపంచ రికార్డ్..

సాహిల్ చౌహాన్ ప్రస్తుతం టీ20 క్రికెట్, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ప్రపంచ రికార్డును కలిగి ఉన్నాడు. జూన్ 17, 2024న, ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ సైప్రస్‌తో జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో 27 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. చౌహాన్ 41 బంతుల్లో 144 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో చౌహాన్ స్ట్రైక్ రేట్ 351.21గా నిలిచింది. చౌహాన్ భారత సంతతికి చెందిన ఎస్టోనియన్ క్రికెటర్. చౌహాన్ ఇన్నింగ్స్‌లో 18 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి.

ఉర్విల్ పటేల్ ఎవరు?

ఉర్విల్ పటేల్ ఒక భారతీయ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, అలాగే నైపుణ్యం కలిగిన వికెట్ కీపర్. అతను గుజరాత్ తరపున దేశీయ క్రికెట్ ఆడుతున్నాడు. IPL 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున అతను మూడు మ్యాచ్‌లు ఆడాడు. ఉర్విల్ పటేల్ అక్టోబర్ 17, 1998న గుజరాత్‌లోని మెహ్సానాలో జన్మించాడు. 2024–25 సయ్యద్ ముష్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఉర్విల్ పటేల్ ఆరు ఇన్నింగ్స్‌లలో 78.75 సగటు, సుమారు 229.92 స్ట్రైక్ రేట్‌తో 315 పరుగులు సాధించి వార్తల్లో నిలిచాడు. ఉర్విల్ పటేల్ 50 టీ20 మ్యాచ్‌లలో 1,230 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వికెట్ కీపింగ్‌లో, అతను 37 క్యాచ్‌లు తీసుకున్నాడు. ఆరు స్టంపింగ్‌లు చేశాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..