AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fan Made Video : వెండితెరపై రోహిత్ శర్మ, మహేశ్ బాబు.. అభిమానులను ఆకట్టుకున్న ఊహించని కాంబినేషన్!

టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్యంగా వార్తల్లో నిలిచారు. క్రికెట్‌కు కాకుండా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు అంకితమిచ్చిన ఒక ఫ్యాన్ వీడియోలో రోహిత్ శర్మ కనిపించారు. మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సృష్టించిన ఈ వీడియోను థియేటర్‌లో ప్రదర్శించగా, రోహిత్ శర్మ కనిపించినప్పుడు అక్కడున్న అభిమానులు హర్షధ్వానాలతో సందడి చేశారు.

Fan Made Video : వెండితెరపై రోహిత్ శర్మ, మహేశ్ బాబు.. అభిమానులను ఆకట్టుకున్న ఊహించని కాంబినేషన్!
Rohit Sharma Mahesh Babu
Rakesh
|

Updated on: Aug 10, 2025 | 2:30 PM

Share

Fan Made Video : టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్యంగా వార్తల్లో నిలిచారు. కెప్టెన్ రోహిత్ శర్మ, టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఒకే తెరపై కనిపించారు. మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రూపొందించిన ఒక వీడియోలో రోహిత్ శర్మ విజువల్స్ కనిపించాయి. క్రికెట్, సినిమా రంగాల నుంచి ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు థియేటర్‌లో ఆనందంతో కేరింతలు కొట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలుగు నటుడు మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా, అభిమానులు ఆయనకు అద్భుతమైన బహుమతిని అందించారు. మహేష్ బాబు కొన్ని వీడియో క్లిప్‌లతో పాటు, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విజువల్స్‌ను కలిపి ఒక ప్రత్యేక వీడియోను రూపొందించారు. ఈ వీడియోను ఒక సినిమా హాలులో ప్రదర్శించారు.

ఆ వీడియోలో రోహిత్ శర్మ తన సెంచరీలను సెలబ్రేట్ చేసుకుంటున్న విజువల్స్‌తో పాటు, ఇటీవల జరిగిన T20 వరల్డ్ కప్ 2024, ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సందర్భంలో రోహిత్ ఫోటోలను కూడా ఉపయోగించారు. ఈ వీడియోలో “రెండు వేర్వేరు ప్రపంచాల నుంచి ఇద్దరు ఐకాన్‌లు”, “వారి వారి రంగాలలో ట్రెండ్‌సెట్టర్‌లు” వంటి కామెంట్స్ కూడా ఉన్నాయి. చివర్లో “హ్యాపీ బర్త్‌డే మహేష్ బాబు. విత్ లవ్ ఫ్రమ్ రోహిత్ శర్మ” అని రాసి ఉంది.

రోహిత్ శర్మ ఇటీవల లండన్‌లో తన కుటుంబంతో కలిసి సెలవులు గడిపారు. అక్కడ భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించడానికి కూడా హాజరయ్యారు. ఆ మ్యాచ్‌లో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌కు మద్దతు తెలుపుతూ కనిపించారు. రోహిత్ శర్మ చివరిసారిగా ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరపున క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్‌తో ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఓడిపోవడంతో ముంబై ఇండియన్స్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.

రోహిత్ త్వరలో అక్టోబర్‌లో ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లే అవకాశం ఉంది. అయితే, ఈ టూర్‌తో రోహిత్ , విరాట్ కోహ్లీ అంతర్జాతీయ కెరీర్ ముగియవచ్చని వార్తలు వస్తున్నాయి. 2027 వరల్డ్ కప్‌లో ఆడేందుకు వారు విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనాలని బీసీసీఐ కోరుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us
దేవుడా మాకేంటి ఇది.. టీమిండియా సెమీస్ ఎంట్రీపై పాక్ ప్లేయర్..
దేవుడా మాకేంటి ఇది.. టీమిండియా సెమీస్ ఎంట్రీపై పాక్ ప్లేయర్..
చేసిన రెండు సినిమాలు ప్లాప్.. అయినా యూత్ లో ఫుల్ క్రేజ్..
చేసిన రెండు సినిమాలు ప్లాప్.. అయినా యూత్ లో ఫుల్ క్రేజ్..
సూర్య, గంభీర్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయమే.. టీమిండియా ఓటమికి కారణం
సూర్య, గంభీర్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయమే.. టీమిండియా ఓటమికి కారణం
గుడ్‌న్యూస్‌. భారీగా తగ్గిన వెండి ధర.. ఎంత తగ్గిందో తెలుసా..?
గుడ్‌న్యూస్‌. భారీగా తగ్గిన వెండి ధర.. ఎంత తగ్గిందో తెలుసా..?
అవార్డ్స్ ఫంక్షన్‏లో రకుల్‏కు చేదు అనుభవం..
అవార్డ్స్ ఫంక్షన్‏లో రకుల్‏కు చేదు అనుభవం..
భారత్ సెమీస్ చేరాలంటే.. 11 ఓవర్లలో ఎంత టార్గెట్ ఛేజ్ చేయాలంటే?
భారత్ సెమీస్ చేరాలంటే.. 11 ఓవర్లలో ఎంత టార్గెట్ ఛేజ్ చేయాలంటే?
మీ మాటే శాసనం.. ఈ రాశివారే మార్చి నెల కింగ్‌లు.. మీ రాశి ఉందా..?
మీ మాటే శాసనం.. ఈ రాశివారే మార్చి నెల కింగ్‌లు.. మీ రాశి ఉందా..?
రైలులో ఇలాంటి వస్తువులు తీసుకెళ్తే జైలు పాలే.. 9 మంది అరెస్ట్
రైలులో ఇలాంటి వస్తువులు తీసుకెళ్తే జైలు పాలే.. 9 మంది అరెస్ట్
కోట్ల ఆస్తులు వదిలేసి పల్లెటూరిలో ఉంటున్న స్టార్ హీరో..
కోట్ల ఆస్తులు వదిలేసి పల్లెటూరిలో ఉంటున్న స్టార్ హీరో..
తెలంగాణ పీజీఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు తేదీలు ఇవే
తెలంగాణ పీజీఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు తేదీలు ఇవే