TeamIndia: కెప్టెన్ ను మార్చాలా.. వద్దా.. అనేది పొట్టి ప్రపంచ కప్ నిర్ణయిస్తుంది: మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా

ఈ సారి తప్పులు జరిగితే.. కెప్టెన్సీ లో మార్పులుండే ఛాన్స్ ఉందని మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా అన్నారు. ఇటీవల డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఓడిపోయాక టీం ఇండియా కెప్టెన్ మార్పుపై చాలా చర్చలు వచ్చాయి.

TeamIndia: కెప్టెన్ ను మార్చాలా.. వద్దా.. అనేది పొట్టి ప్రపంచ కప్ నిర్ణయిస్తుంది:  మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా
Team India
Follow us

|

Updated on: Jul 04, 2021 | 9:42 PM

TeamIndia: ఈ సారి తప్పులు జరిగితే.. కెప్టెన్సీ లో మార్పులుండే  ఛాన్స్ ఉందని మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా అన్నారు. ఇటీవల డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఓడిపోయాక టీం ఇండియా కెప్టెన్ మార్పుపై చాలా చర్చలు వచ్చాయి. విరాట్ కోహ్లీని మార్చాలని మాజీలు సైతం విమర్శలు గుప్పించారు. రోహిత్ ను కెప్టెన్ గా నియమించాలని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా మాట్లాడారు. టీ20 ప్రపంచ కప్ లో ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలని కోహ్లికి సూచించాడు. అయితే, ఇప్పుడున్న ఇలాంటి పరిస్థితుల్లో సారథ్యాన్ని మార్చడం మంచిది కాదని తెలిపాడు. ‘ఇలాంటి సమయంలో సారథిని మార్చడం మంచింది కాదు. కానీ, కచ్చితంగా హిట్ మ్యాన్ రోహిత్‌ కు సారథిగా ఉండే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్ తో చాలా విషయాలు తెలుస్తాయి. పొట్టి ప్రపంచ కప్ మరో మూడు నాలుగు నెలల్లో రానుంది. ఇంత తక్కువ సమయంలో రోహిత్ ను కెప్టెన్ గా ఉంచితే, జట్టుకు కష్టంగా మారవచ్చు. ఇప్పటికైతే కెప్టెన్నీ లో మార్పులు ఉందకూడదు. హిట్ మ్యాన్ ఇప్పటికే కొన్ని మ్యాచ్ లకు నాయకత్వం వహించాడు. ఆ మ్యాచుల్లో విజయం సాధించి తన సత్తా చాటాడు. అలాగే ఐపీఎల్ లోనూ తన మార్క్ చూసించి ట్రోఫీలు గెలుచుకున్నాడు. తాత్కాలిక కెప్టెన్ గా రోహిత్ నియమించడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఎవరైనా పూర్తిస్థాయి నాయకుడిగా ఉన్నప్పుడే జట్టులో వారి ముద్ర ఉంటుందని’ ఆయన పేర్కొన్నాడు.

ప్రపంచ కప్ ముందు ఇలాంటి నిర్ణయం సరైంది కాదు. అది టీమిండియాకు, విరాట్ కోహ్లీకి, రోహిత్‌కు మంచిది కాదని ఆయన పేర్కొన్నాడు. అయితే నాయకత్వం మార్చాలా వద్దా అని పొట్టి ప్రపంచ కప్ నిర్ణయిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఓటమి తరువాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై చాలా విమర్శలు వచ్చాయి. జట్టు కూర్పుపై కూడా పలువురు ఆరోపణలు చేశారు. అలాగే ఆటగాళ్లపై కూడా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, జట్టులోని ఆటగాళ్లపై అయిష్టాన్ని వెలిబుచ్చాడు. న్యూజిలాండ్ తో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో టీమిండియా అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా వచ్చే నెలలో ఆథిత్య జట్టుతో 5 టెస్టుల సిరీస్ లో తలపడనుంది.

Also Read:

MS Dhoni Marriage Day: పెళ్లి రోజు సందర్భంగా భార్యకు సర్ ప్రైజ్ ఇచ్చిన మిస్టర్ కూల్..!

Lionel Messi: క్రిస్టియానో రొనాల్డో రికార్డ్‌ను బ్రేక్ చేసిన అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ..!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..