India vs England: చివరి టెస్టు కోసం నెట్స్​లో శ్రమిస్తున్న టీమిండియా ​.. మొతేరా పిచ్​ ఎలా ఉండబోతుందో చెప్పిన హిట్​మ్యాన్

|

Mar 01, 2021 | 7:01 AM

డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానన్నాడు. ఒక్కొక్కరి నుంచి 10వేల రూపాయలు వసూలు చేశారు. రోజులు గడిచాయి. ఇల్లు లేదు. డబ్బులు రాలేదు. బాధితులు టీవీనైన్‌ని ఆశ్రయించారు. టీవీ నైన్ ఆ సర్పంచ్ బండారాన్ని బయట పెట్టింది. దీంతో సర్పంచ్ దారికొచ్చాడు. వసూలు చేసిన డబ్బులు వెనక్కి ఇచ్చేశాడు.

India vs England: చివరి టెస్టు కోసం నెట్స్​లో శ్రమిస్తున్న టీమిండియా ​.. మొతేరా పిచ్​ ఎలా ఉండబోతుందో చెప్పిన హిట్​మ్యాన్
TeamIndia
Follow us on

Ind vs Eng: మెతేరా స్టేడియంలో ఇంగ్లాండ్​తో జరగనున్న నాలుగో టెస్టు కోసం టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది బీసీసీఐ.  మార్చి 4 నుంచి మొతేరా వేదికగా తుది టెస్టు ప్రారంభం కానుంది.

ఫోటోలతోపాటు ఇంగ్లాండ్​తో సిరీస్​లో చివరిదైన నాలుగో టెస్టు కోసం భారత ప్లేయర్లు సన్నద్ధమవుతున్నారు. అంటూ ట్వీట్‌ను ట్యాగ్ ​ చేసింది.

ఈ సిరీస్​లో రోహిత్ శర్మ, అక్షర్​ పటేల్​, రవిచంద్రన్​ అశ్విన్​లు అంచనాలను అందుకోగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ చివరి టెస్టులోనైనా సెంచరీ చేయాలని పట్టుదలతో ఉన్నాడు. విరాట్ చివరిసారిగా 2019లో శతకం చేశాడు.

నాలుగు టెస్టుల సిరీస్​లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న కోహ్లీ సేన.. చివరి మ్యాచ్​ను గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని రెడీ అవుతున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్​ రేసు నుంచి నిష్క్రమించిన ఇంగ్లాండ్​ ఈ మ్యాచ్​లో గెలిచి సిరీస్​ను సమం చేయాలని ప్రయత్నిస్తోంది.

ఇదిలావుంటే నాలుగో టెస్టుపై ఓ ట్వీట్ చేశాడు హిట్​మ్యాన్ రోహిత్ శర్మ. అంతే కాదు మెతేరా పిచ్ నాలుగో టెస్ట్‌కు ఎలా ఉండనుందో కూడా చెప్పుకొచ్చాడు. మూడో టెస్టుకు ముందు వికెట్​ స్పిన్​కు సహకరిస్తుందంటూ చెప్పిన రోహిత్​ తాజాగా ఇలా పోస్ట్ పెట్టాడు. దీనితోపాటు పచ్చగా ఉన్న గ్రౌండ్‌లో అలా ఫోటోకు ఫోజ్ ఇచ్చాడు. అంటే ఇది ఖచ్చితంగా ఇది బ్యాటింగ్‌కు సహకరిస్తుందని చెప్పకనే చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ఇష్యూకు రానున్నా పసిడి బాండ్లు.. మార్చి 5 వరకు గోల్డెన్ ఛాన్స్.. నాలుగు కిలోల వరకు కొనేందుకు అనుమతి

RBI Instructions : చిరిగిపోయిన కరెన్సీ నోట్లపై ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు.. బాధితులు వాటిని మార్చుకోవడానికి ఏం చేయాలంటే..

3rd Wave Dangerous : నిర్లక్ష్యం చేస్తే మూడో ముప్పు తప్పదు.. థర్డ్ వేవ్ మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్న సీఎస్ఐర్..