IND vs PAK Playing 11: అభిషేక్ ఆడతాడా లేదా..? పాక్ కెప్టెన్ కోరికపై సూర్యకుమార్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్..
Team India: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా అతని ఆరోగ్యం క్షీణించింది. దీని ఫలితంగా అతను ఆసుపత్రిలో చేరి నమీబియాతో ఆడలేకపోయాడు. అయితే, పాకిస్తాన్ జట్టుతో ఆడతాడో లేదా అనేది సందిగ్ధంగా మారింది.

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్, పాకిస్తాన్ హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ఇంకా 24 గంటలు మాత్రమే మిగిలి ఉంది. రెండు జట్లు ఎలాంటి ప్లేయింగ్ 11తో బరిలోకి దిగుతారో చూడాలి. ఇందుకోసం ఆసక్తిగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ చర్చలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతను ఫిట్ గా ఉన్నాడా, ఆడటానికి సిద్ధంగా ఉన్నాడా? టీం ఇండియా అతన్ని బరిలోకి దింపుతుందా? మ్యాచ్ కు ఒక రోజు ముందు, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా అభిషేక్ ఆడాలని తన కోరికను వ్యక్తం చేశాడు. ఆ తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ కెప్టెన్ కోరికను నెరవేర్చేందుకు ఫిక్స్ అయ్యాడు. ఈ మేరకు అభిషేక్ పాల్గొంటున్నట్లు ప్రకటించాడు.
ఫిబ్రవరి 14వ తేదీ శనివారం, కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే మ్యాచ్కు ఒక రోజు ముందు, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో అభిషేక్ శర్మ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అయితే, దీనికి ముందు, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా విలేకరుల సమావేశంలో కూడా ఈ ప్రశ్న తలెత్తింది. అభిషేక్ శర్మ లేకపోవడం పాకిస్తాన్ జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుందా అని అడిగినప్పుడు, ఆఘా, “అభిషేక్ ఎంత మంచి ఆటగాడో మనందరికీ తెలుసు. మేం ఉత్తమ ఆటగాళ్లతో ఆడాలనుకుంటున్నాం. కాబట్టి రేపటి మ్యాచ్లో అతను ఆడాలని నేను కోరుకుంటున్నాను. అతను కోలుకుంటాడని, ఆడగలడని నేను ఆశిస్తున్నాను” అని అన్నాడు.
కొద్దిసేపటి తర్వాత, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు. అభిషేక్ పాల్గొనడం, పాకిస్తాన్ కెప్టెన్ ప్రకటనపై వ్యాఖ్యానించమని అడిగారు. భారత కెప్టెన్ రెండు ప్రశ్నలకు ఒకే ప్రకటనలో సమాధానమిచ్చాడు. “పాకిస్తాన్ కెప్టెన్ అభిషేక్ శర్మ ఆడాలని కోరుకుంటే, అతను ఖచ్చితంగా ఆడతాడు” అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
