IPL 2023: మినీ వేలం నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్ ప్లేయర్లు.. లిస్టులో తెలుగు తేజం కూడా.. కారణం అదేనంట?

|

Dec 08, 2022 | 11:07 AM

IPL 2023 Mini Auction: ఐపీఎల్ 2023 వేలం కోసం మొత్తం 991 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఐపీఎల్ 2023 కోసం మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది.

IPL 2023: మినీ వేలం నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్ ప్లేయర్లు.. లిస్టులో తెలుగు తేజం కూడా.. కారణం అదేనంట?
Team India
Follow us on

IPL 2023 Mini Auction: భారత టెస్టు జట్టులో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతోన్న ఇద్దరు ప్రముఖ బ్యాట్స్‌మెన్‌లు చెతేశ్వర్ పుజారా, హనుమ విహారి తదుపరి ఐపీఎల్ వేలంలో భాగం కావడం లేదు. నివేదిక ప్రకారం, ఈ ఇద్దరు ఆటగాళ్లు వేలం కోసం తమ పేర్లను నమోదు చేసుకోలేదు. ఐపీఎల్ 2023 వేలం కోసం మొత్తం 991 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఐపీఎల్ 2023 కోసం మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది.

ఐపీఎల్ మినీ వేలంలో 991 మంది ప్లేయర్లు..

ఐపీఎల్ 2023 వేలం కోసం మొత్తం 991 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఐపీఎల్ 2023 కోసం మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది. గత సారి మెగా వేలం రెండు రోజులు జరగ్గా ఈసారి ఒక్కరోజు మాత్రమే మినీ వేలం జరగనుంది. ఈసారి బెన్ స్టోక్స్, సామ్ కరణ్, కామెరూన్ గ్రీన్ వంటి ఆటగాళ్లు అందరి దృష్టిని ఆకర్షించబోతున్నారు, వారి చేరికతో వేలం చాలా ఆసక్తికరంగా మారింది.

మినీ వేలం కారణంగానే పేర్లను నమోదు చేసుకోలేదు..

చెతేశ్వర్ పుజారా గురించి చెప్పాలంటే, అంతకుముందు అతను చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగంగా ఉన్నాడు. కానీ, అతనికి ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. 2014లో ఐపీఎల్‌లో చివరి మ్యాచ్‌ ఆడాడు. కాగా, గత వేలంలో హనుమ విహారి అమ్ముడుపోలేదు. అతను చివరిసారిగా 2019 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు. ఒక మూలం టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపింది,

ఇవి కూడా చదవండి

ఇది మినీ వేలం కనుక, పుజారా, హనుమ విహారీలకు ఆయా జట్లు ఎక్కువ బడ్జెట్ కేటాయించవు. ఎందుకంటే, ప్రస్తుతం అన్ని జట్ల వద్ద తక్కువ బడ్జెట్ మిగిలి ఉంది. ఈ కారణంగా, ఆటగాళ్లిద్దరూ వేలంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారంట. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఓ వార్త వచ్చింది. ఆటగాళ్ల తుది జాబితాను సిద్ధం చేయడానికి డిసెంబర్ 9 చివరి తేదీగా నిలిచిన సంగతి తెలిసిందే. వేలంలో దాదాపు 200 మంది ఆటగాళ్లు పాల్గొనవచ్చు.
ఈ వేలంలో కేన్ విలియమ్సన్, బెన్ స్టోక్స్, జిమ్మీ నీషమ్, నికోలస్ పూరన్, జాసన్ హోల్డర్ వంటి ఆటగాళ్ల బేస్ ధర రూ.2 కోట్లు. శ్రీలంకకు చెందిన ఏంజెలో మాథ్యూస్ కూడా తనను తాను రెండు కోట్ల బేస్ ప్రైస్ కేటగిరీలో ఉంచుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..