AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ‘తినండి.. తాగండి.. కానీ, ఆ పని మాత్రం వద్దు’.. త్రో బ్యాక్ ఫోటోతో కోహ్లీ స్వీట్ వార్నింగ్..

విరాట్ కోహ్లీ మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో త్రోబాక్ ఫోటోను పంచుకోవడం ద్వారా బాధను వ్యక్తం చేశాడు. ఈ ఫోటో కోహ్లి చిన్ననాటిది.

Virat Kohli: 'తినండి.. తాగండి.. కానీ, ఆ పని మాత్రం వద్దు'.. త్రో బ్యాక్ ఫోటోతో కోహ్లీ స్వీట్ వార్నింగ్..
Virat Kohli
Venkata Chari
|

Updated on: Sep 10, 2022 | 10:20 PM

Share

2022 ఆసియా కప్‌లో భారత జట్టు ప్రయాణం ముగిసింది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 101 పరుగుల తేడాతో విజయం సాధించి వీడ్కోలు పలికింది. ఇప్పుడు రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే సిరీస్‌లకు సన్నాహాలు ప్రారంభించనుంది. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఈ సిరీస్‌ చాలా కీలకం కానుంది.

ఆసియా కప్‌లో భారత జట్టు ప్రదర్శన పేలవంగా ఉండవచ్చు. కానీ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ టోర్నమెంట్ చాలా అద్భుతమైనది. అఫ్గానిస్థాన్‌పై సెంచరీ సాధించడం ద్వారా కోహ్లి దాదాపు మూడేళ్ల కరువును ముగించాడు. 2022 ఆసియా కప్‌లో కోహ్లీ 5 మ్యాచ్‌ల్లో 276 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని బ్యాట్ నుంచి ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు వచ్చాయి. ప్రస్తుతం టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.

ఇప్పుడు విరాట్ కోహ్లీ మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో త్రోబాక్ ఫోటోను పంచుకోవడం ద్వారా తన బాధను వ్యక్తం చేశాడు. ఈ ఫోటో కోహ్లి చిన్ననాటిది. అందులో అతను ఆహారం తింటున్నాడు. ‘తినండి, తాగండి. కానీ, ఎవరి హృదయాన్ని గాయపరచవద్దు’ అని ఫోటో క్యాప్షన్‌లో కోహ్లీ రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

Virat Kohli (1)

పాకిస్థాన్‌పై ఓటమి తర్వాత ప్రకటన..

ఇటీవలి కాలంలో చాలా సందర్భాల్లో కోహ్లీ తన బాధను వ్యక్తం చేశాడు. ఆసియా కప్ 2022 సూపర్‌లో పాకిస్థాన్‌తో భారత్ ఓడిపోయిన తర్వాత, టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత MS ధోని మాత్రమే తనకు సందేశం ఇచ్చాడని కోహ్లీ చెప్పుకొచ్చాడు. విలేకరుల సమావేశంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, ‘నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు, నాకు ఒక వ్యక్తి నుంచి మాత్రమే సందేశం వచ్చింది. అది మహేంద్ర సింగ్ ధోనీ. చాలా మంది వద్ద నా నంబర్ ఉంది. చాలా మంది టీవీలో అభిప్రాయాన్ని ఇచ్చారు. కానీ, నా నంబర్ ఉన్నవాళ్లెవరూ నాకు మెసేజ్ చేయలేదు.

‘ఎవరికైనా గౌరవం, ఆప్యాయత ఉంటే ఇలాగే ఉంటుంది’ అని కోహ్లీ పేర్కొన్నాడు. నేను అతనితో అభద్రతా భావాన్ని అనుభవించలేదు. అతను నాతో అదే విధంగా భావించలేదు. నేను చెప్పేది ఒక్కటే, నేను ఎవరితోనైనా ఏదైనా చెప్పాలనుకుంటే, నేను అతనిని వ్యక్తిగతంగా సంప్రదిస్తాను. నా అభిప్రాయం ప్రకారం, ప్రపంచం మొత్తం ముందు అభిప్రాయం చెప్పడం సరికాదు, మీరు నాకు సహాయం చేయాలనుకుంటే, మీరు నాకు వ్యక్తిగతంగా చెప్పవచ్చు’ అంటూ చెప్పుకొచ్చాడు.

సెంచరీ చేసిన తర్వాత భావోద్వేగానికి గురయ్యాడు..

అంతటితో ఆగని విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేస్తూ బాధను కూడా వ్యక్తం చేశాడు. ‘మీ ఆనందంలో సంతోషంగా ఉన్నవారిని, దుఃఖంలో బాధపడేవారిని గమనించండి’ అని కోహ్లీ రాసుకొచ్చాడు. ఈ వ్యక్తులు మీ హృదయంలో స్థానం కలిగి ఉంటారు. ఆ తర్వాత అఫ్గానిస్థాన్‌పై సెంచరీ చేసిన తర్వాత కూడా కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు.

అప్పుడు కోహ్లి మాట్లాడుతూ, ‘నాకు ఏది లభించినా అది భగవంతుడి వల్లనే. దీనిని అంగీకరించడానికి నేను సిగ్గుపడను. నిజం చెప్పాలంటే, నేను నా శక్తితో బ్యాటింగ్ చేశాను. నన్ను నేను ఆశ్చర్యపరుచుకున్నాను. నా 60-70 పరుగులు కూడా వైఫల్యంగా మారాయి. ఇది చాలా షాకింగ్’ అంటూ చెప్పుకొచ్చాడు.