AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: ఫైనల్‌కి ముందే ఈ 3 కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే.. లేదంటే ట్రోఫీ చేజారొచ్చు రోహిత్ భయ్యో..

ఇప్పుడు భారత జట్టు ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఈ టైటిల్ మ్యాచ్ నేడు అంటే జూన్ 29న బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరగనుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే టోర్నీలో ఇప్పటి వరకు ఇరు జట్లు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇటువంటి పరిస్థితిలో, అభిమానులు ఉత్కంఠభరితమైన ఫైనల్‌ను చూడాలనే పూర్తి ఆశతో ఎదురుచూస్తున్నారు.

IND vs SA: ఫైనల్‌కి ముందే ఈ 3 కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే.. లేదంటే ట్రోఫీ చేజారొచ్చు రోహిత్ భయ్యో..
Ind Vs Sa Final
Venkata Chari
|

Updated on: Jun 29, 2024 | 1:09 PM

Share

3 Key Changes in Team India ahead of Final Against South Africa: రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు గురువారం టీ20 ప్రపంచ కప్ 2024 రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ (IND vs ENG)ని 68 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.

ఇప్పుడు భారత జట్టు ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఈ టైటిల్ మ్యాచ్ నేడు అంటే జూన్ 29న బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరగనుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే టోర్నీలో ఇప్పటి వరకు ఇరు జట్లు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇటువంటి పరిస్థితిలో, అభిమానులు ఉత్కంఠభరితమైన ఫైనల్‌ను చూడాలనే పూర్తి ఆశతో ఎదురుచూస్తున్నారు.

ఆఖరి మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలవాలంటే, కెప్టెన్ రోహిత్ శర్మ 3 కఠిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అవేంటో ఓసారి చూద్దాం..

ఫైనల్ మ్యాచ్‌కి ముందు రోహిత్ శర్మ తీసుకోవలసిన 3 కష్టమైన నిర్ణయాలు ప్లేయింగ్ XIలో ముగ్గురిపై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వారెవరో ఓసారి చూద్దాం..

1. శివమ్ దూబేని తొలగించడం..

IPL 2024లో ప్రదర్శన కారణంగా శివమ్ దూబే T20 ప్రపంచ కప్ కోసం జట్టులో చోటు సంపాదించాడు. టోర్నమెంట్‌లో మంచి ప్రదర్శన చేయడం ద్వారా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు దూబేకి గొప్ప అవకాశం లభించింది. అయితే, అతను దానిని సద్వినియోగం చేసుకోవడంలో నిరంతరం విఫలమవుతున్నాడు. సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో అతను గోల్డెన్ డక్‌తో ఔట్ అయినప్పుడు, దూబే ప్లేయింగ్ XIలో ఎందుకు భాగమయ్యాడు అనే ఒకే ఒక్క ప్రశ్న అభిమానులందరిలో ఉంది. ఆఖరి మ్యాచ్‌లో గెలవాలంటే, ప్లేయింగ్ ఎలెవన్ నుంచి దూబేని తప్పించాలని రోహిత్ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.

2. యశస్వి జైస్వాల్ టీ20 ప్రపంచకప్‌లో అరంగేట్రం..

ప్రస్తుత టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఓపెనింగ్ బాధ్యతలను విరాట్ కోహ్లీ నిర్వహిస్తున్నాడు. దీంతో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. అయితే, ఓపెనింగ్‌లో కోహ్లీ నిరంతరం అభిమానుల అంచనాలను తారుమారు చేస్తున్నాడు. 3వ స్థానంలో ఆడుతున్నప్పుడు విరాట్ కోహ్లీ రికార్డు చాలా బాగుంది. ఇటువంటి పరిస్థితిలో, చివరి మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్‌కు అవకాశం కల్పించి, టి20 ప్రపంచకప్‌లో అరంగేట్రం చేయడానికి హిట్‌మాన్ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.

3. బ్యాటింగ్ ఆర్డర్‌లో అక్షర్ పటేల్‌ స్థానం మార్పు..

ప్రస్తుత టోర్నీలో, ఎడమచేతి వాటం ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేస్తూ చాలా మ్యాచ్‌లలో విలువైన పరుగులు చేయడం కూడా జట్టు విజయానికి కారణంగా మారింది. అయితే మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ చాలా మ్యాచ్‌ల్లో రవీంద్ర జడేజా తర్వాత బ్యాటింగ్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. మరోవైపు జడేజా నుంచి పరుగులు రావడం లేదు.

ఫైనల్ మ్యాచ్‌లో వేగంగా పరుగులు సాధించాలంటే అక్షర్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్ అవసరం. రోహిత్ దానిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

మరి ఈ మార్పులు చేస్తాడా లేదా అదే సేమ్ టీంతో ఫైనల్ మ్యాచ్‌లోకి బరిలోకి దిగుతాడా లేదా అనేది చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..