Rishabh Pant: మాజీ క్రికెటర్ చేతిలో మోసపోయిన టీమిండియా స్టార్ ప్లేయర్.. రూ.1.6 కోట్లు హాఫంట్.. ఎందుకంటే?

చౌక ధరలకు లగ్జరీ వాచీలను కొనుగోలు చేసిన వ్యవహారంలో భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ దారుణంగా మోసపోయాడు. రిషబ్ పంత్‌ను మోసం చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.

Rishabh Pant: మాజీ క్రికెటర్ చేతిలో మోసపోయిన టీమిండియా స్టార్ ప్లేయర్.. రూ.1.6 కోట్లు హాఫంట్.. ఎందుకంటే?
Rishabh Pant

Updated on: May 24, 2022 | 6:29 AM

ఐపీఎల్ 2022 (IPL 2022) ముగింపు భారత క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌(Rishabh Pant)కు అంతగా కలిసి రాలేదు. అతని కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవడంలో విఫలమైంది. క్రికెట్ ఫీల్డ్‌లో నిరాశతో పాటు మైదానం వెలుపల కూడా అతనికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఢిల్లీ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ రూ. 1.6 కోట్లు మోసపోయాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ ఫోర్జరీ పని చేసింది కూడా ఓ క్రికెటర్ కావడం విశేషం. చౌక ధరలకు లగ్జరీ వాచీలను కొనుగోలు చేసిన వ్యవహారంలో భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ దారుణంగా మోసపోయాడు. అతడిని మోసం చేసిన నిందితుడు హర్యానా మాజీ క్రికెటర్ మృణాక్ సింగ్. ఓ వ్యాపారవేత్తను రూ.6 లక్షల మోసం చేసిన కేసులో మృనాక్ ఇప్పటికే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నారు. రిషబ్ పంత్, అతని మేనేజర్ హర్యానా క్రికెటర్ మృనాక్ సింగ్‌పై (Rishabh Pant Fraud Case)ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ కేసులో ముంబై పోలీసులు తాజాగా ఆ మోసగాడిని అరెస్ట్ చేశారు.

మిడ్ డే అనే ఆంగ్ల వార్తాపత్రికలో వచ్చిన కథనం ప్రకారం, ముంబైకి చెందిన ఓ వ్యాపారితో కలిసి ఇలాంటి మోసానికి పాల్పడ్డాడు. ఈ నిందితుడు ఖరీదైన, విలాసవంతమైన వాచీలు, మొబైల్ ఫోన్లు చౌకగా ఇస్తామని వ్యాపారులకు, క్రికెటర్లకు తప్పుడు వాగ్దానాలు చేసి మోసం చేసేవాడు.

వాచీల వల్ల రూ.1.63 కోట్లు నష్టపోయాయి..

ఇవి కూడా చదవండి

ముంబై వ్యాపారవేత్తను కూడా రూ.6 లక్షలకు మోసం చేశాడు. ఆ తర్వాత అతను కొన్ని రోజుల క్రితం అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి అతను ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు. ఫిబ్రవరి 2021 లో ఈ నిందితుడు పంత్‌కు ఇలాంటి వాగ్దానాలు చేశాడు. పంత్ రెండు ఖరీదైన వాచీల కోసం సుమారు 1.63 కోట్లు చెల్లించాడు. ఈ సంఘటనకు సంబంధించి, పంత్, అతని మేనేజర్ పునీత్ సోలంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సాకేత్ కోర్టు మ్రింక్ సింగ్‌ను హాజరుపరచాలని ఆర్థర్ రోడ్ జైలుకు నోటీసు జారీ చేసింది.

ఐపీఎల్ 2022 తర్వాత పంత్ తదుపరి మిషన్..

ఐపీఎల్ 2022 వైఫల్యం తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో మంచి ప్రదర్శనతో బ్యాడ్ ఫేజ్‌ను వదిలివేయడంపై పంత్ దృష్టి నెలకొంది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ తర్వాత, పంత్ కూడా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్నాడు. అక్కడ భారత జట్టు ఒక టెస్ట్ మ్యాచ్, 6 వన్డే-టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: IPL 2022: ఐపీఎల్‌ 2022లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టు ఏదో తెలుసా..? భారీ సిక్స్ ఎవరు కొట్టారంటే..?

Arshdeep Singh: వసీం అక్రం బౌలింగ్‌ చూసి నేర్చుకున్నాడు.. ఇప్పుడు టీమిండియాకు ఎంపికైయ్యాడు..

Loading...
Unable to load recommendations.
Follow Us