AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India : భారత క్రికెట్‌లో తీవ్ర దుమారం.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐ వేటు వేయనుందా?

Team India : ఇంగ్లండ్‌తో టీ 20 సిరీస్‌లో ఘోర ఓటమి తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరుస వైఫల్యాల నేపథ్యంలో బీసీసీఐ చర్యలు తీసుకుంటుందా అనే చర్చ క్రికెట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

Team India : భారత క్రికెట్‌లో తీవ్ర దుమారం.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐ వేటు వేయనుందా?
Team India
Rakesh
|

Updated on: Jul 12, 2026 | 2:23 PM

Share

Team India : భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం తీవ్రమైన అలజడి రేగుతోంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లోనూ భారత్ ఘోరంగా ఓడిపోయింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ 4-0తో కైవసం చేసుకుని టీమిండియాను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఘోర పరాజయంతో భారత జట్టు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తన నంబర్-1 స్థానాన్ని కోల్పోయింది. వరుస ఓటముల నేపథ్యంలో ఇప్పుడు అందరి వేళ్లు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైపు చూపిస్తున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా వెనుదిరిగిన భారత జట్టును చూసి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా బీసీసీఐ నిద్ర లేవడం లేదా, అసలు గంభీర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోదా అనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.

చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కూ తప్పని సెగ

ఈ వివాదం కేవలం కోచ్‌తోనే ఆగిపోలేదు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను కూడా నెటిజన్లు తీవ్రంగా నిలదీస్తున్నారు. కొన్ని నెలల క్రితమే అద్భుతంగా ఆడి టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టు, బ్రిటన్ పర్యటనకు వచ్చేసరికి ఇంతలా కుప్పకూలిపోవడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు వరల్డ్ కప్ గెలిచిన విజయవంతమైన జట్టులో కొత్త కెప్టెన్‌ను తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని అగార్కర్‌ను తప్పుబడుతున్నారు. ఇంగ్లండ్, ఐర్లాండ్ పిచ్‌లు, వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని ముందే తెలిసినప్పుడు, కొత్త కెప్టెన్ నేతృత్వంలో జట్టును ఒక తాటిపైకి తీసుకురావడంలో, సరైన ముందస్తు ప్రణాళికలు వేయడంలో కోచ్ గంభీర్ ఎందుకు విఫలమయ్యారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

వరుసగా అన్ని సిరీస్‌లు ఓడిపోయినా మారరా?

సాధారణంగా మ్యాచ్ ఓడిపోయిన ప్రతిసారీ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో ఒకే మాట చెబుతుంటారు, జట్టులో ప్రస్తుతం ట్రాన్సిషన్ నడుస్తోందని సమర్థించుకుంటారు. అయితే వరల్డ్ కప్ ఆడిన సీనియర్ ఆటగాళ్లంతా జట్టులో ఉన్నప్పుడు, గంభీర్ ఇంకా ఎలాంటి మార్పుల గురించి మాట్లాడుతున్నారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా చెత్త రికార్డులను మూటగట్టుకుంది. గంభీర్ కోచింగ్ స్టైల్ వల్ల జట్టు ఒకసారి ఓటమి బాట పడితే, మళ్లీ పుంజుకోలేక పూర్తిగా డీలా పడిపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also : Team India: ‘2028 వరల్డ్ కప్ వరకు కెప్టెన్‌గా నేనే ‘.. శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు..?

న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక.. ఇప్పుడు ఇంగ్లండ్

గంభీర్ కోచింగ్ రికార్డును గమనిస్తే అభిమానులకు ఆందోళన కలగడం సహజమే. ఆయన హయాంలో న్యూజిలాండ్ జట్టు భారత్‌కు వచ్చి టెస్ట్ సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆ తర్వాత సౌతాఫ్రికా జట్టు కూడా మన సొంత గడ్డపైనే 2-0తో వన్డే సిరీస్‌ను రౌండ్ చేసింది. ఇక శ్రీలంక పర్యటనలోనూ భారత్ 2-0తో వన్డే సిరీస్ ఓడిపోయింది. ఇటీవలే చిన్న జట్టు అయిన ఐర్లాండ్ కూడా టీమిండియాను 2-0తో ఓడించి షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఇంగ్లండ్ వంతు వచ్చింది, వారు కూడా 4-0తో టీమిండియాను మట్టికరిపించారు. ఆస్ట్రేలియా పర్యటనలోనూ పర్త్ టెస్ట్ గెలిచినప్పటికీ, ఆ తర్వాత వరుసగా మూడు టెస్టులు ఓడిపోయి సిరీస్‌ను చేజార్చుకున్నాం.

తప్పులు ఒప్పుకోకుండా సాకులు చెబితే కుదరదు

అన్నింటికంటే ముఖ్యంగా గౌతమ్ గంభీర్ ఎప్పుడూ తన వ్యూహాత్మక లోపాలను ఒప్పుకోరని, ఓటమికి ఎల్లప్పుడూ పిచ్ లేదా పరిస్థితులపై సాకులు చెబుతుంటారని విమర్శలు ఉన్నాయి. సోషల్ మీడియాలో అభిమానులు గంభీర్‌ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. జట్టులోని సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టేస్తున్నా బోర్డులో గంభీర్‌కు ఉన్న పట్టు లేదా సెట్టింగ్ వల్ల ఆయనకు ఎలాంటి ఇబ్బంది రావడం లేదని కామెంట్లు పెడుతున్నారు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలలో జట్టు ప్రతిష్టను దిగజార్చిన తర్వాత కూడా బీసీసీఐ గంభీర్‌ను ప్రశ్నిస్తుందా, లేదా రాబోయే జింబాబ్వే పర్యటనను చూపించి ఈ ఓటములను కప్పిపుచ్చుతుందా అనేది వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us