జులై 1 నుంచి ఎడ్జ్బాస్టన్లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ టెస్టు ఇరుజట్లకు చాలా కీలకమైనది. ఎందుకంటే గతేడాది సిరీస్లో టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా, ఆ సమయంలో కరోనా కారణంగా గత ఏడాది ఈ మ్యాచ్ జరగలేదు. ప్రస్తుతం చివరి టెస్ట్ను జులై 1న నిర్వహించనున్నారు. సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని టీమ్ ఇండియా చూస్తోంది. కానీ అంతకు ముందు, కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా పాజిటివ్గా తేలడంతో, భారీ దెబ్బ తగిలింది. ఎడ్జ్బాస్టన్ టెస్టులో రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదు. రోహిత్ ఆడకపోతే టీమిండియా కెప్టెన్ ఎవరు అనే ప్రశ్న ప్రస్తుతం క్రికెట్ అభిమానులను వేధిస్తోంది. ఇలాంటి అనేక ప్రశ్నలను పక్కనపెట్టి, రోహిత్ గురించి మాట్లాడితే.. చాలా కీలక సందర్భాలలో రోహిత్కు దురదృష్టం వెంటాడుతుందని మాజీలు అంటున్నారు. ఇలా అదృష్టం ద్రోహం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయంటూ నెట్టింట్లో చర్చించుకుంటున్నారు.
కొన్నిసార్లు రోహిత్ శర్మ అన్ ఫిట్ అవుతుండగా, కొన్నిసార్లు బ్యాడ్ ఫామ్ అతని లయను చెడగొడుతోంది. టీమ్ ఇండియాకు మ్యాచ్ లేదా సిరీస్ చాలా కీలకమైనప్పుడు ఇది ఎక్కువగా జరుగుతుంది.
రోహిత్ అదృష్టం కలిసి రాని సందర్భాలు..