Harman Preet Kaur: అభిమానులతో టీమిండియా కెప్టెన్ భావోద్వేగ సందేశం.. ఎప్పటికీ వెన్నంటే ఉంటామన్న నెటిజన్లు..

హర్మన్ అర్ధ సెంచరీ కూడా చేసింది. కానీ కీలక సమయంలో భారత కెప్టెన్ రనౌట్ కావడం జట్టును దెబ్బ తీసింది. ఓటమి బాధతో మైదానంలోనే కన్నీళ్ల పర్యంతమైన..

Harman Preet Kaur: అభిమానులతో టీమిండియా కెప్టెన్ భావోద్వేగ సందేశం.. ఎప్పటికీ వెన్నంటే ఉంటామన్న నెటిజన్లు..
Harman Preet Kaur

Updated on: Feb 25, 2023 | 11:29 AM

ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ క్రికెట్ అభిమానులకు భావోద్వేగ సందేశాన్ని పంచుకుంది. బలమైన ఆస్ట్రేలియన్ల చేతిలో ఐదు పరుగుల తేడాతో భారత జట్టు పరాజయాన్ని చవిచూసింది. 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఒక దశలో విజయం వైపు నడించింది. హర్మన్ అర్ధ సెంచరీ కూడా చేసింది. కానీ కీలక సమయంలో భారత కెప్టెన్ రనౌట్ కావడం జట్టును దెబ్బ తీసింది. ఓటమి బాధతో  మైదానంలోనే కన్నీళ్ల పర్యంతమైన హర్మన్ తాజాగా అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేసింది.

కాగా, దీనిపై సానుకూలంగా స్పందించిన నెటిజన్లు ఆమెకు మద్ధుతుగా నిలిచారు. ఈ క్రమంలో ఇటలీ ఫుట్‌బాల్ ప్లేయర్ అగతా ఇసాబెల్లా సెంటాస్సో ‘మీరు చేయగలరని నేను ఖచ్చితంగా ఉన్నాను. ఇటలీకి చెందిన నేను మీ కొత్త అభిమానిని’ అంటూ రాసుకొచ్చింది. ఇంకా ‘మీరు చాలా బాగా ఆడారు. ఏదేం జరిగినా ఎప్పటికీ టీమిండియా వెన్నంటే ఉంటామ’ని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ‘మీరు అద్భుతంగా ఆడారు. అందులో ఎటువంటి సందేహం లేద’ని మరో నెటిజన్ అన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us