AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: కోహ్లీ భయ్యా మీరు గ్రేట్‌..తనను కలిసేందుకు వచ్చిన పాక్‌ సింగర్‌కు విరాట్‌ ఏం గిఫ్ట్‌ ఇచ్చాడో తెలుసా?

అక్టోబర్ 23న మెల్‌బోర్న్‌లో జరిగిన ఇండో-పాక్ మ్యాచ్ తర్వాత పాక్‌ గాయకుడు అజార్ విరాట్ కోహ్లీని కలిశాడు. ఈ సమావేశానికి ముందు అతను విరాట్ అభిమాని మాత్రమే. కానీ కోహ్లీని కలిసిన తర్వాత అతనికి సూపర్ ఫ్యాన్‌గా మారిపోయాడంటున్నాడు.

Virat Kohli: కోహ్లీ భయ్యా మీరు గ్రేట్‌..తనను కలిసేందుకు వచ్చిన పాక్‌ సింగర్‌కు విరాట్‌ ఏం గిఫ్ట్‌ ఇచ్చాడో తెలుసా?
Virat Kohli
Basha Shek
|

Updated on: Oct 25, 2022 | 10:12 AM

Share

టీమిండియా రన్‌ మెషిన్‌ విరాట్ కోహ్లీకి మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. శత్రుదేశమైన పాక్‌లోనూ అతనికి పెద్ద ఎత్తున ఫ్యా్న్స్‌ ఉన్నారు. గతంలో ఎన్నోసార్లు ఇది నిరూపితమైంది. తాజాగా విరాట్ అభిమానుల జాబితాలో మరొకరు చేరారు. అతనే పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ సింగర్‌ అసిమ్ అజార్. అక్టోబర్ 23న మెల్‌బోర్న్‌లో జరిగిన ఇండో-పాక్ మ్యాచ్ తర్వాత పాక్‌ గాయకుడు అజార్ విరాట్ కోహ్లీని కలిశాడు. ఈ సమావేశానికి ముందు అతను విరాట్ అభిమాని మాత్రమే. కానీ కోహ్లీని కలిసిన తర్వాత అతనికి సూపర్ ఫ్యాన్‌గా మారిపోయాడంటున్నాడు. పాక్‌ సింగర్‌ ఇంత సంబరపడిపోవడానికి కారణంమేంటో తెలుసా? కోహ్లీ అతనిని రిసీవ్ చేసుకున్న తీరు, అదేవిధంగా తన ఆటోగ్రాఫ్‌తో కూడిన టీషర్ట్‌ను బహుమతిగా ఇవ్వడమే. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు అజార్‌. విరాట్‌తో కలిసున్న ఫొటోలను షేర్‌ చేస్తూ ‘ ఈ మ్యాచ్‌కు ముందు నేను కేవలం కోహ్లీకి అభిమాని మాత్రమే. కానీ మెల్‌బోర్న్‌ మ్యాచ్‌ తర్వాత ఆయన వ్యక్తిత్వానికి సూపర్‌ ఫ్యాన్‌గా మారిపోయాను. నాకోసం నీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్స్‌ కోహ్లీ’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు పాక్‌ సింగర్.

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కోహ్లీ క్రేజ్‌ అంటే అట్లుంటది మరి.. అతని ఆటతీరు, వ్యక్తిత్వానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే నంటూ విరాట్‌ ఫ్యాన్స్‌ ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు. కాగా మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో , భారత్ 4 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. విరాట్‌ 53 బంతుల్లో 82 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో టీమిండియాను గెలిపించాడు. కాగా ఇటీవల లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఇంగ్లండ్‌, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లోనూ ఓ పాక్ అభిమాని కోహ్లీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ‘విరాట్ కోహ్లీ.. రిటైర్‌ అయ్యేలోపు పాకిస్తాన్‌లో క్రికెట్ మ్యాచ్ ఆడు ప్లీజ్‌’ అని ప్లకార్డును పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

కాంగ్రెస్ Vs జనసేన.. పవన్ కల్యాణ్ తెలంగాణ టూర్‌తో పెరిగిన..
కాంగ్రెస్ Vs జనసేన.. పవన్ కల్యాణ్ తెలంగాణ టూర్‌తో పెరిగిన..
రూ.50 లక్షల గృహ రుణంపై రూ.20 లక్షలు ఆదా.. అద్భుతమైన ట్రిక్
రూ.50 లక్షల గృహ రుణంపై రూ.20 లక్షలు ఆదా.. అద్భుతమైన ట్రిక్
సమతా మహాకుంభ్‌ బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవం..అట్టహాసంగా
సమతా మహాకుంభ్‌ బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవం..అట్టహాసంగా
బుల్లితెర నటి వాహిని మృతి.. కరాటే కళ్యాణి ఎమోషనల్ పోస్ట్..
బుల్లితెర నటి వాహిని మృతి.. కరాటే కళ్యాణి ఎమోషనల్ పోస్ట్..
ఇదేందయ్యా సామీ.. మెగా ఈవెంట్‌కు ముందే కోలుకోలేని దెబ్బ
ఇదేందయ్యా సామీ.. మెగా ఈవెంట్‌కు ముందే కోలుకోలేని దెబ్బ
బ్యాంకుల కస్టమర్లకు అలర్ట్.. ఆర్బీఐ కీలక నిర్ణయం
బ్యాంకుల కస్టమర్లకు అలర్ట్.. ఆర్బీఐ కీలక నిర్ణయం
ఓటీటీలోకి 'మనశంకర వరప్రసాద్‌గారు'.. అఫీషియల్ డేట్ వచ్చేసింది
ఓటీటీలోకి 'మనశంకర వరప్రసాద్‌గారు'.. అఫీషియల్ డేట్ వచ్చేసింది
మీ ఇంట్లో ఈ ఒక్క కూరగాయ ఉంటే చాలు.. క్యాన్సర్ మీ గేట్ దాటి రాలేదు
మీ ఇంట్లో ఈ ఒక్క కూరగాయ ఉంటే చాలు.. క్యాన్సర్ మీ గేట్ దాటి రాలేదు
ఓరీ దేవుడో నిలబడి నీళ్లు తాగితే ఇంత డేంజరా..? ఇప్పుడే ఆపండి..
ఓరీ దేవుడో నిలబడి నీళ్లు తాగితే ఇంత డేంజరా..? ఇప్పుడే ఆపండి..
టీ20 ప్రపంచకప్ 2026లో ఏకంగా 40 మంది భారత సంతతి ఆటగాళ్లు..
టీ20 ప్రపంచకప్ 2026లో ఏకంగా 40 మంది భారత సంతతి ఆటగాళ్లు..