కోహ్లీ సహచరుడి దెబ్బకు బౌలర్ల బెంబేలు.. 7 సిక్సులు, 2 ఫోర్లతో అర్థ సెంచరీ.. అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటోన్న ఆటగాడు..!

|

Nov 18, 2021 | 3:06 PM

Syed Mushtaq Ali Trophy 2021: IPLలో ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్‌సీబీ వంటి జట్లలో భాగమైన ఆటగాడు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021లో ఫినిషర్‌గా బౌలర్ల వెన్ను విరుస్తున్నాడు.

కోహ్లీ సహచరుడి దెబ్బకు బౌలర్ల బెంబేలు.. 7 సిక్సులు, 2 ఫోర్లతో అర్థ సెంచరీ.. అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటోన్న ఆటగాడు..!
Vishnu Vinod
Follow us on

Syed Mushtaq Ali Trophy 2021: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021లో నవంబర్ 18న కేరళ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ విష్ణు వినోద్ తుఫా ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తమిళనాడు లాంటి జట్టుపై బ్యాటింగ్ చేస్తూ కేవలం 26 బంతుల్లోనే 65 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ సమయంలో అతను రెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాదాడు. అంటే కేవలం తొమ్మిది బంతుల్లోనే ఫోర్లు, సిక్సర్లతో 50 పరుగులు నమోదయ్యాయి. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ నాలుగు వికెట్లకు 182 పరుగుల పటిష్ట స్కోరు చేసింది. వినోద్‌తో పాటు ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ కూడా హాఫ్ సెంచరీ చేసి 51 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అయితే విష్ణు వినోద్ ఇన్నింగ్స్ కారణంగా కేరళ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కేరళ చివరి ఏడు ఓవర్లలో 90 పరుగులు జోడించింది. ఇందులో 65 పరుగులు విష్ణు వినోద్ చేసినవే కావడం విశేషం. ఈరోజు కేరళ కెప్టెన్ సంజూ శాంసన్ కేవలం రెండు బంతులు ఆడిన తర్వాత ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేరళ జట్టు పవర్‌ప్లే వరకు 42 పరుగులు చేసింది. దీని తర్వాత మహ్మద్ అజారుద్దీన్ రూపంలో తొలి వికెట్ పడింది. అతని నిష్క్రమణ తర్వాత వచ్చిన సచిన్ బేబీ కూడా స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. అయితే అవతలి వైపు నుంచి రోహన్ కున్నుమ్మల్ పరుగుల వేగాన్ని కొనసాగించాడు. 43 బంతుల్లో ఐదు సిక్సర్లతో 51 పరుగులు చేసి 13వ ఓవర్లో ఔటయ్యాడు. రెండు బంతుల తర్వాత కెప్టెన్ శాంసన్ కూడా నడక కొనసాగించాడు. అలాంటి పరిస్థితుల్లో కేరళ స్కోరు 13 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 91 పరుగులుగా మారింది. ఇలాంటి టైంలో క్రీజులోకి వచ్చిన విష్ణు వినోద్, సచిన్ బేబీతో కలిసి దుమ్ము దులిపారు. 17 ఓవర్ల వరకు ఇద్దరూ ఎలాంటి రిస్క్ తీసుకోలేదు.

18వ ఓవర్ నుంచి తుఫాన్ మొదలు..
18వ ఓవర్ నుంచి కేరళ ఇన్నింగ్స్ మలుపు తిరిగింది. సందీప్ వారియర్ వేసిన ఈ ఓవర్లో విష్ణు వినోద్ 23 పరుగులు సాధించాడు. మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత 18వ ఓవర్‌లో ఎం మహమ్మద్‌ను టార్గెట్ చేశాడు. వినోద్ తన బంతుల్లో మూడు సిక్సర్లు కొట్టి 19 పరుగులు చేశాడు. పి.సర్వాన్ కుమార్ వేసిన చివరి ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. వినోద్ ఒక సిక్స్, సంజీవన్ అఖిల్ రెండు ఫోర్లు కొట్టారు. ఈ విధంగా చివరి మూడు ఓవర్లలో 63 పరుగులు వచ్చాయి. చివరి 18 బంతుల్లో ఏడు సిక్సర్లు, మూడు ఫోర్లు బాదాడు. విష్ణు వినోద్ 22 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్‌సీబీ వంటి జట్లలో భాగమైన విష్ణు వినోద్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మంచి ఆటతీరు కనబరిచాడు. అంతకుముందు రైల్వేస్‌పై 43 బంతుల్లో అజేయంగా 63 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లోనూ కేరళ 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ విధంగా కేరళకు అద్భుత ఫినిషర్‌గా మారాడు.

Also Read: Deepak Chahar: ఒక్క చూపుతో లక్ష రూపాయలు గెలిచాడు.. అదేలాగంటారా..

Ravichandran Ashwin: ఆనందం తిరిగొచ్చింది.. కోచ్ రాహుల్ ద్రవిడ్‎పై అశ్విన్ ప్రశంసలు..